గురు పౌర్ణమి కోసం
సనాతన ధర్మానికి ఆధారాలుగా వేద పురాణేతిహాసాలను ప్రస్తావించుకున్నాం. వాటి స్వరూప స్వభావాలను వివరించుకున్నాం. ఆ సద్గ్రంథాల ఆధారంగాను, సత్పురుషుల వ్యవహార ధోరణితోను మన ఆచార సంపద సమృద్ధి చెందింది.
అయితే వాటితో పాటు మన సంస్కృతి అభ్యుదయానికీ, పరిపుష్టికీ దోహదపడింది – స్తోత్రవాజ్ఞ్మయం.
మన స్తోత్ర సాహిత్యం అపారం. దీనిశక్తి ఈదేశ సంగీత నృత్యాది కళలపై కూడా ప్రగాఢంగా ప్రసరించింది. భగవంతుని తత్త్వ, మహిమ, లీలా, గుణ వైభవాలను కీర్తించడమే స్తుతి. యజ్ఞములయందు వైదిక మంత్రాలతో సాగిన దేవతా స్తుతి, పురాణాలలో శ్లోకాలతో నిబద్దం చేశారు వ్యాస మహర్షి.
భగవానుని పలు రూపాలలో ఉపాసించే భక్తులు, తమ అనుభూతికీ, ఆత్మ నివేదనకీ అక్షరాకారాలుగా అపార స్తోత్ర వాజ్ఞ్మయాన్ని సంతరించారు.
ఆధ్యాత్మిక దృక్పథంతోనే గాక, కళా దృష్టితో దర్శించినా ఒక పరిపూర్ణ కవితా ప్రక్రియగా స్తోత్ర సాహితి వర్ధిల్లింది. వేద పురాణ మార్గాలను అనుసరిస్తూ కాళిదాసాది మహాకవులు అద్భుత ఛందో విన్యాసాలతో భావ చిత్రాలతో, శబ్దార్థాలంకారాలతో మహోన్నత స్థాయిలో స్తోత్ర సాహితిని అందించారు. అంతేకాక తత్త్వచింతన, జీవుని వేదన, లీలలు, మహిమలు…మొదలైనవెన్నో ఆ సాహిత్యంలో ప్రవహించాయి. అనేక స్తోత్రాలు పఠన పారాయణాల వల్ల మంచి ప్రభావాన్ని చూపించడాన్ని అనుభవించిన కొందరు ఆ స్తోత్రాలను పవిత్ర గ్రంథాలుగా గుర్తించి ఆరాధింపజేశారు. సహస్ర నామ స్తోత్రాల వంటి అంశాలతో పాటు వివిధ స్తుతులు, భారత భాగవతాలలో లభిస్తున్నాయి. పురాణ వాజ్ఞ్మయంలో సరే సరి.
ఇక ఆదిశంకర భగవత్పాదుల వారు శక్తితో స్తోత్ర సాహిత్యం ఒక ఉజ్జ్వల స్థాయిని అందుకుంది. వారి కనకధారా స్తోత్రం, సౌందర్య లహరి, శివానందలహరి, మహా కావ్యాలుగా ఆదరింపబడుతున్నాయి. సామాన్యులు సైతం పారాయణ చేసుకుంటున్నారు.
శివ తాండవ స్తుతి, మహిషాసుర మర్దినీ స్తోత్రం, వంటివి సంగీతాత్మకమైన చక్కని లయతో సర్వ ప్రజానీకానికి మంచి రసానుభూతినిస్తున్నాయి. అష్టకాలుగా, దండకాలుగా విస్తరిల్లిన స్తుతి సాహిత్యం, సంస్కృతంలోనే ఒక మహా సముద్రమంత గోచరిస్తుంది. శ్యామలా దండకం వంటివి నేటికీ నిత్య పారాయణాలయ్యాయి. పుష్పదంతుని మహిమ్నా స్తుతి ప్రసిద్దిగా దేశంలో వ్యాపించింది.
లీలా శుకుని శ్రీ కృష్ణ కర్ణామృతం, అప్పయ్య దీక్షితుల శివకర్ణామృతం, శంకర కృతంగా ప్రసిద్ధి చెందిన శ్రీరామ కర్ణామృతం, సాహిత్య లోకంలో అమృత కళాశాలు. కొన్ని స్తోత్ర కావ్యాలు వివిధ క్షేత్రాలతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు గురువాయూర్ నారాయణుని స్తోత్రించిన శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టాద్రి తపోబలంతో సమకూర్చారు. భాగవతానికి మరో రూపమైన ఈ కృతి కేరళ, తమిళనాడు, ఆంధ్ర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఛందస్సు లో, భావుకతలో, అలంకారిక సంపదలో సర్వ సులక్షణ గ్రంథమిది. పారాయణ వల్ల పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రంథంగా ప్రతిష్ఠ పొందింది.
మయూర కవి రచించిన సూర్య శతకం, దాని అనుకరిస్తూ శ్రీ కూర నారాయణ కవి రచించిన సుదర్శన శతకం వంటివి చదువుతుంటేనే తన్మయం కలిగిస్తాయి. భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యులలో కొంతైనా బ్రతికున్నది అంటే ఈ స్తోత్ర సాహిత్య ప్రభావాన్ని అంగీకరించవలసిందే. జయదేవుని గీతాగోవిందం ఒక రసస్తుతి.
భారతీయ దేశ భాషలన్నింటిలోనూ స్తోత్ర సాహితి ఉజ్జ్వల స్థానాన్ని పొందింది. మహారాష్ట్రలో తుకారాం, జ్ఞానేశ్వర్, వంటి వారి రచనలు, తమిళంలో ఆళ్వారుల, నాయనార్ల, వైష్ణవ, శైవ సాహిత్యాలు, కన్నడలో బసవేశ్వరుని వచనాలు, దాస సాహిత్యం….కొద్ది ఉదాహరణలు మాత్రమే.
మన తెలుగులో దాశరధీ శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం, వంటివి దైవభక్తితో పాటు ధర్మనిరతిని, నైతికతనీ, కూడా ప్రబోధించాయి. ఆంజనేయ దండకం వంటివి అతి సామాన్యుని సైతం ఆదుకుంటున్నాయి. పోతనగారి భాగవత కావ్యం, ఎన్నో అద్భుత స్తుతి పద్యాలను ఆంధ్ర ప్రదేశంలో శాశ్వత ప్రతిష్ఠ చేసింది. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరశతకం గంభీర రచనగా శైవ సాహిత్యంలో మణిదీపమైంది.
ఈ స్తోత్ర సాహితి సంగీత ప్రపంచంలో కూడా పదిలమైంది. భగవత్ సంకీర్తన లేని సంగీతాన్ని భారతీయ హృదయం ఆమోదించలేదేమో! మొత్తం ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా దేవత స్తుతియే సంకీర్తింప బడి సంగీతం పరిపుష్టమైంది. మీరా, సూరదాస్, వంటి ఔత్తరాహికులతో పాటు అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామా శాస్త్రి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, తరిగొండ వెంకమాంబ, వంటి వాగ్గేయకారులు ఎందరో సంకీర్తన రూప స్తోత్ర సాహితిని సృజించారు.
ఇవి మన తరగని కళా సంపదలు, ధార్మిక వారసత్వాలు, ముక్తి సోపానాలు. భారతీయుల భక్తి భావన గుండెలలో పదిల పరచుకొని, కాపాడుకుంటోంది. తద్వారా మన భక్తి మార్గాన్ని, ధార్మిక కళా సంపదను నిరంతరాయంగా నిలుపుకోగలుగుతున్నాం.
గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః
పలాలమివ ధాన్యార్థీ త్యజేద్ గ్రంథమశేషతః
After studying the scriptures, an intelligent person intent on gaining knowledge and liberation should discard the scriptures altogether, like one who desires grain discards the husk.
ఎలా అయితే ధాన్యం పండించిన తరువాత రైతు ధాన్యపు పొట్టుని వదిలివేసి ధాన్యపు గింజలను మాత్రమే గ్రహిస్తాడో అలాగే గ్రంథాభ్యసనం అయిన తరువాత మేధావి అయినవాడు
జ్ఞానము విజ్ఞానము సముపార్జనా తత్పరుడు అయినవాడు గ్రంథ సారాన్ని గ్రహించి గ్రంథాన్ని వదిలివేస్తాడు.
- ఎస్. నాగలక్ష్మి
సనాతన ధర్మానికి ఆధారాలుగా వేద పురాణేతిహాసాలను ప్రస్తావించుకున్నాం. వాటి స్వరూప స్వభావాలను వివరించుకున్నాం. ఆ సద్గ్రంథాల ఆధారంగాను, సత్పురుషుల వ్యవహార ధోరణితోను మన ఆచార సంపద సమృద్ధి చెందింది.
అయితే వాటితో పాటు మన సంస్కృతి అభ్యుదయానికీ, పరిపుష్టికీ దోహదపడింది – స్తోత్రవాజ్ఞ్మయం.
మన స్తోత్ర సాహిత్యం అపారం. దీనిశక్తి ఈదేశ సంగీత నృత్యాది కళలపై కూడా ప్రగాఢంగా ప్రసరించింది. భగవంతుని తత్త్వ, మహిమ, లీలా, గుణ వైభవాలను కీర్తించడమే స్తుతి. యజ్ఞములయందు వైదిక మంత్రాలతో సాగిన దేవతా స్తుతి, పురాణాలలో శ్లోకాలతో నిబద్దం చేశారు వ్యాస మహర్షి.
భగవానుని పలు రూపాలలో ఉపాసించే భక్తులు, తమ అనుభూతికీ, ఆత్మ నివేదనకీ అక్షరాకారాలుగా అపార స్తోత్ర వాజ్ఞ్మయాన్ని సంతరించారు.
ఆధ్యాత్మిక దృక్పథంతోనే గాక, కళా దృష్టితో దర్శించినా ఒక పరిపూర్ణ కవితా ప్రక్రియగా స్తోత్ర సాహితి వర్ధిల్లింది. వేద పురాణ మార్గాలను అనుసరిస్తూ కాళిదాసాది మహాకవులు అద్భుత ఛందో విన్యాసాలతో భావ చిత్రాలతో, శబ్దార్థాలంకారాలతో మహోన్నత స్థాయిలో స్తోత్ర సాహితిని అందించారు. అంతేకాక తత్త్వచింతన, జీవుని వేదన, లీలలు, మహిమలు…మొదలైనవెన్నో ఆ సాహిత్యంలో ప్రవహించాయి. అనేక స్తోత్రాలు పఠన పారాయణాల వల్ల మంచి ప్రభావాన్ని చూపించడాన్ని అనుభవించిన కొందరు ఆ స్తోత్రాలను పవిత్ర గ్రంథాలుగా గుర్తించి ఆరాధింపజేశారు. సహస్ర నామ స్తోత్రాల వంటి అంశాలతో పాటు వివిధ స్తుతులు, భారత భాగవతాలలో లభిస్తున్నాయి. పురాణ వాజ్ఞ్మయంలో సరే సరి.
ఇక ఆదిశంకర భగవత్పాదుల వారు శక్తితో స్తోత్ర సాహిత్యం ఒక ఉజ్జ్వల స్థాయిని అందుకుంది. వారి కనకధారా స్తోత్రం, సౌందర్య లహరి, శివానందలహరి, మహా కావ్యాలుగా ఆదరింపబడుతున్నాయి. సామాన్యులు సైతం పారాయణ చేసుకుంటున్నారు.
శివ తాండవ స్తుతి, మహిషాసుర మర్దినీ స్తోత్రం, వంటివి సంగీతాత్మకమైన చక్కని లయతో సర్వ ప్రజానీకానికి మంచి రసానుభూతినిస్తున్నాయి. అష్టకాలుగా, దండకాలుగా విస్తరిల్లిన స్తుతి సాహిత్యం, సంస్కృతంలోనే ఒక మహా సముద్రమంత గోచరిస్తుంది. శ్యామలా దండకం వంటివి నేటికీ నిత్య పారాయణాలయ్యాయి. పుష్పదంతుని మహిమ్నా స్తుతి ప్రసిద్దిగా దేశంలో వ్యాపించింది.
లీలా శుకుని శ్రీ కృష్ణ కర్ణామృతం, అప్పయ్య దీక్షితుల శివకర్ణామృతం, శంకర కృతంగా ప్రసిద్ధి చెందిన శ్రీరామ కర్ణామృతం, సాహిత్య లోకంలో అమృత కళాశాలు. కొన్ని స్తోత్ర కావ్యాలు వివిధ క్షేత్రాలతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు గురువాయూర్ నారాయణుని స్తోత్రించిన శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టాద్రి తపోబలంతో సమకూర్చారు. భాగవతానికి మరో రూపమైన ఈ కృతి కేరళ, తమిళనాడు, ఆంధ్ర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఛందస్సు లో, భావుకతలో, అలంకారిక సంపదలో సర్వ సులక్షణ గ్రంథమిది. పారాయణ వల్ల పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రంథంగా ప్రతిష్ఠ పొందింది.
మయూర కవి రచించిన సూర్య శతకం, దాని అనుకరిస్తూ శ్రీ కూర నారాయణ కవి రచించిన సుదర్శన శతకం వంటివి చదువుతుంటేనే తన్మయం కలిగిస్తాయి. భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యులలో కొంతైనా బ్రతికున్నది అంటే ఈ స్తోత్ర సాహిత్య ప్రభావాన్ని అంగీకరించవలసిందే. జయదేవుని గీతాగోవిందం ఒక రసస్తుతి.
భారతీయ దేశ భాషలన్నింటిలోనూ స్తోత్ర సాహితి ఉజ్జ్వల స్థానాన్ని పొందింది. మహారాష్ట్రలో తుకారాం, జ్ఞానేశ్వర్, వంటి వారి రచనలు, తమిళంలో ఆళ్వారుల, నాయనార్ల, వైష్ణవ, శైవ సాహిత్యాలు, కన్నడలో బసవేశ్వరుని వచనాలు, దాస సాహిత్యం….కొద్ది ఉదాహరణలు మాత్రమే.
మన తెలుగులో దాశరధీ శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం, వంటివి దైవభక్తితో పాటు ధర్మనిరతిని, నైతికతనీ, కూడా ప్రబోధించాయి. ఆంజనేయ దండకం వంటివి అతి సామాన్యుని సైతం ఆదుకుంటున్నాయి. పోతనగారి భాగవత కావ్యం, ఎన్నో అద్భుత స్తుతి పద్యాలను ఆంధ్ర ప్రదేశంలో శాశ్వత ప్రతిష్ఠ చేసింది. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరశతకం గంభీర రచనగా శైవ సాహిత్యంలో మణిదీపమైంది.
ఈ స్తోత్ర సాహితి సంగీత ప్రపంచంలో కూడా పదిలమైంది. భగవత్ సంకీర్తన లేని సంగీతాన్ని భారతీయ హృదయం ఆమోదించలేదేమో! మొత్తం ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా దేవత స్తుతియే సంకీర్తింప బడి సంగీతం పరిపుష్టమైంది. మీరా, సూరదాస్, వంటి ఔత్తరాహికులతో పాటు అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామా శాస్త్రి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, తరిగొండ వెంకమాంబ, వంటి వాగ్గేయకారులు ఎందరో సంకీర్తన రూప స్తోత్ర సాహితిని సృజించారు.
ఇవి మన తరగని కళా సంపదలు, ధార్మిక వారసత్వాలు, ముక్తి సోపానాలు. భారతీయుల భక్తి భావన గుండెలలో పదిల పరచుకొని, కాపాడుకుంటోంది. తద్వారా మన భక్తి మార్గాన్ని, ధార్మిక కళా సంపదను నిరంతరాయంగా నిలుపుకోగలుగుతున్నాం.
గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః
పలాలమివ ధాన్యార్థీ త్యజేద్ గ్రంథమశేషతః
After studying the scriptures, an intelligent person intent on gaining knowledge and liberation should discard the scriptures altogether, like one who desires grain discards the husk.
ఎలా అయితే ధాన్యం పండించిన తరువాత రైతు ధాన్యపు పొట్టుని వదిలివేసి ధాన్యపు గింజలను మాత్రమే గ్రహిస్తాడో అలాగే గ్రంథాభ్యసనం అయిన తరువాత మేధావి అయినవాడు
జ్ఞానము విజ్ఞానము సముపార్జనా తత్పరుడు అయినవాడు గ్రంథ సారాన్ని గ్రహించి గ్రంథాన్ని వదిలివేస్తాడు.
భాగవతము భక్తి రసశృంగార రసభరిత కావ్యము. భాగవత కథామృతము జన్మరాహిత్య మార్గమునకు సోపానము. భాగవతము మోక్షపదము ప్రసాదించెడి కల్పతరువు. పారమార్ధిక చింతనకు పట్టుకొమ్మ సంసారాబుధి దాటించగల నావ. అరిషడ్వర్గములను, ఈషణత్రయములను మనస్సుకు ఆధీనముగావించి నిరంతరము వారి నామ సంకీర్తనగావించుటకు దోహదికారి. కావున పరమోతృష్టమైన మానవజన్మనెత్తిన మనము భాగవతమందలి, భక్తిరస ప్రపూరిత ఉపాఖ్యానములను అవగాహన చేసుకొని భక్తితత్పరతో ధర్మపధమున జీవయాత్ర సాగించవలెనను పరమసత్యమును భాగవతమునకు బోధించుచున్నది.
భాగవతములోని ఏ కథను చదివినా ఏ పురాణ పురుషుని జీవితాన్ని పరిశీలించినా పరమసత్యం, పరమాత్మను తత్వాన్ని ఎరుకపడుతుంది. ప్రహ్లాదుడు తన తల్లి కడుపులోనుండే నారదుని ఉపదేశాన్ని అందుకున్నాడు. పుట్టిననాటినుంచి విష్ణుస్మరణ చేసేవాడు. తనతండ్రిలో ఉన్న అజ్ఞానాన్ని రూపు మాపదల్చాడు. వెంటనే పెదవులు విడవడకముందే హరి అనిసంబోధించడం చేసేవాడు. ఇక మాటలొచ్చి నడక వచ్చిన తరువాత అహర్నిశమూ హరినామాన్ని వీడలేదు.
తానే కాదు తన తోడి వారిచేత కూడా హరి భజన చేయంచేవాడు. చేసేవాడు, చేయంచేవాడు కూడా హరి ఒక్కడేనని ఈ జన్మను వృథాపరుచుకోకుండా ఉండాలంటే సార్థక్యం పొందాలంటే కేవలం హరినామోచ్చారణమే మార్గమని బోధించేవాడు. హరి అసురులకు శత్రువు అని తండ్రి గురువుల చేత చెప్పించాడు. పెద్దల చేత చెప్పించాడు. అసురీగుణాలు ప్రతివారిలోను ఉంటాయ. కాని వాటిని పెరగనివ్వకుండా పెద్దవి కాకుండా మొదట్లోనే తుంచివేస్తే దైవీగుణాలు బయటపడ్తాయ. ఆ దైవగుణాలే ప్రదర్శితవౌతుంటే కొన్నాళ్లకు ఈ జన్మ నుంచి విడవడి పరమాత్మ సాయుజ్యాన్ని పొందుతామని ప్రహ్లాదుడు చేసి చూపించాడు. తండ్రికి మల్లె తాను అసురుడైనా దైవీగుణాలతో విరాజిల్లే మహాత్ముడిగా పెరిగాడు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.
చివరకు తనతండ్రికి పరమపదసోపానాన్ని నిర్మించి వైకుంఠ వాసుని పాదపద్మాల దగ్గర చోటు చూపించాడు. తాను చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అటువంటి ఎందరో మహానుభావుల చరిత్రను భాగవతం చెబుతుంది. అందుకే పండితులకే కాక పామరులకు సైతం భాగవతం అంటే ప్రాణం. నిర్థనులకు ధనం వంటిది భాగవతం. అవిద్యానాశకారి. విజ్ఞాన దాయని.
నేడు కలియుగంలో అరాచకత్వం పెచ్చుపెరిగింది. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడుతున్నారు. ఆధ్యాత్మికతకు దూరంగా అవుతు న్నారు. ఒకవేళ భగవంతుని పూజ చేసినా అది కేవలం నామ మాత్రంగానో, లేక ఆడంబరాలకు విలువనిచ్చేవారే ఎక్కువగా కన బడుతున్నారు. ఆధ్యాత్మిక పథంలో నడవడానికి పూజ ఒక మెట్టు. దాన్ని కూడా స్వార్థంతో అనవసర ఆడంబరాలకుపోయ అసలైన అర్థాన్ని తెలుసుకోకుండానే ఉతృష్టమైన సంపదను పొందకుండా తాత్కాలిక సంపదతో సంతృప్తిపొందుతున్నారు.
నేటి వాతావరణంలో వావివరుసలు కూడా తెలియని దీన స్థితుల్లో రాక్షస ప్రవర్తనలతో మానవీయ విలువల్ని మంటకలుపుతున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్టు ఎంతమంది మంచిని ప్రబోధించినా విన్నంతసేపు వూకొట్టి తరువాత మళ్లీ పాతపాటను అందుకుంటు న్నారు. మానవ సంబంధాల్ని తెంచుకుంటూ మానవ మృగాలుగా మారుతున్నారు. ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ ఎవరి దగ్గరకూ రారు. అందుకే కర్మఫలాన్ని అర్థం చేసుకొంటూ లభించిన మానవజన్మను సార్థకం చేసుకోవాలి మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాల్ని అలవరచుకోవాలి. నిజమైన మానవత్వం వెంట దైవత్వం ఉంటుంది.దీన్ని తెలుసుకొనేందుకు భాగవత పారాయణమొక్కటే తరుణోపాయం. భాగవత పఠనం వల్ల ‘మానవసేవే మాధవసేవ’ అన్న దానిలో పరమార్థ అర్థమవుతుంది. మానవీయ విలువలు పెరుగుతాయ. భాగవతాన్ని చదివి అవగాహన చేసుకొన్నవారికి అటు పరలోక సంపదతో పాటుగా ఈలోకంలో కష్టాలు లేని సుఖమయ జీవనం అందుతుంది.
భాగవతములోని ఏ కథను చదివినా ఏ పురాణ పురుషుని జీవితాన్ని పరిశీలించినా పరమసత్యం, పరమాత్మను తత్వాన్ని ఎరుకపడుతుంది. ప్రహ్లాదుడు తన తల్లి కడుపులోనుండే నారదుని ఉపదేశాన్ని అందుకున్నాడు. పుట్టిననాటినుంచి విష్ణుస్మరణ చేసేవాడు. తనతండ్రిలో ఉన్న అజ్ఞానాన్ని రూపు మాపదల్చాడు. వెంటనే పెదవులు విడవడకముందే హరి అనిసంబోధించడం చేసేవాడు. ఇక మాటలొచ్చి నడక వచ్చిన తరువాత అహర్నిశమూ హరినామాన్ని వీడలేదు.
తానే కాదు తన తోడి వారిచేత కూడా హరి భజన చేయంచేవాడు. చేసేవాడు, చేయంచేవాడు కూడా హరి ఒక్కడేనని ఈ జన్మను వృథాపరుచుకోకుండా ఉండాలంటే సార్థక్యం పొందాలంటే కేవలం హరినామోచ్చారణమే మార్గమని బోధించేవాడు. హరి అసురులకు శత్రువు అని తండ్రి గురువుల చేత చెప్పించాడు. పెద్దల చేత చెప్పించాడు. అసురీగుణాలు ప్రతివారిలోను ఉంటాయ. కాని వాటిని పెరగనివ్వకుండా పెద్దవి కాకుండా మొదట్లోనే తుంచివేస్తే దైవీగుణాలు బయటపడ్తాయ. ఆ దైవగుణాలే ప్రదర్శితవౌతుంటే కొన్నాళ్లకు ఈ జన్మ నుంచి విడవడి పరమాత్మ సాయుజ్యాన్ని పొందుతామని ప్రహ్లాదుడు చేసి చూపించాడు. తండ్రికి మల్లె తాను అసురుడైనా దైవీగుణాలతో విరాజిల్లే మహాత్ముడిగా పెరిగాడు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.
చివరకు తనతండ్రికి పరమపదసోపానాన్ని నిర్మించి వైకుంఠ వాసుని పాదపద్మాల దగ్గర చోటు చూపించాడు. తాను చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అటువంటి ఎందరో మహానుభావుల చరిత్రను భాగవతం చెబుతుంది. అందుకే పండితులకే కాక పామరులకు సైతం భాగవతం అంటే ప్రాణం. నిర్థనులకు ధనం వంటిది భాగవతం. అవిద్యానాశకారి. విజ్ఞాన దాయని.
నేడు కలియుగంలో అరాచకత్వం పెచ్చుపెరిగింది. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడుతున్నారు. ఆధ్యాత్మికతకు దూరంగా అవుతు న్నారు. ఒకవేళ భగవంతుని పూజ చేసినా అది కేవలం నామ మాత్రంగానో, లేక ఆడంబరాలకు విలువనిచ్చేవారే ఎక్కువగా కన బడుతున్నారు. ఆధ్యాత్మిక పథంలో నడవడానికి పూజ ఒక మెట్టు. దాన్ని కూడా స్వార్థంతో అనవసర ఆడంబరాలకుపోయ అసలైన అర్థాన్ని తెలుసుకోకుండానే ఉతృష్టమైన సంపదను పొందకుండా తాత్కాలిక సంపదతో సంతృప్తిపొందుతున్నారు.
నేటి వాతావరణంలో వావివరుసలు కూడా తెలియని దీన స్థితుల్లో రాక్షస ప్రవర్తనలతో మానవీయ విలువల్ని మంటకలుపుతున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్టు ఎంతమంది మంచిని ప్రబోధించినా విన్నంతసేపు వూకొట్టి తరువాత మళ్లీ పాతపాటను అందుకుంటు న్నారు. మానవ సంబంధాల్ని తెంచుకుంటూ మానవ మృగాలుగా మారుతున్నారు. ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ ఎవరి దగ్గరకూ రారు. అందుకే కర్మఫలాన్ని అర్థం చేసుకొంటూ లభించిన మానవజన్మను సార్థకం చేసుకోవాలి మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాల్ని అలవరచుకోవాలి. నిజమైన మానవత్వం వెంట దైవత్వం ఉంటుంది.దీన్ని తెలుసుకొనేందుకు భాగవత పారాయణమొక్కటే తరుణోపాయం. భాగవత పఠనం వల్ల ‘మానవసేవే మాధవసేవ’ అన్న దానిలో పరమార్థ అర్థమవుతుంది. మానవీయ విలువలు పెరుగుతాయ. భాగవతాన్ని చదివి అవగాహన చేసుకొన్నవారికి అటు పరలోక సంపదతో పాటుగా ఈలోకంలో కష్టాలు లేని సుఖమయ జీవనం అందుతుంది.
No comments:
Post a Comment