ప్రియమైన భాగవత శివ పరివారం కు శుభాకాంక్షలు
గురువు గారు రోజు చెబుతున్న భాగవతం లో అన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు ? , గురువు గారు భాగవతం చెప్పిన తర్వాత ఒక్కసారి ఆ పేర్లు తలచుకుందాం అని ప్రయత్న పూర్వకం గా చాల రోజులు నుంచి ప్రయతిస్తున్నాను
స్వయంభు మనువు
స్వయంభు మనువు, మనకు ఉన్న పదునాలుగు మంది మనువులు అందరిలో మొదటివాడు. అతని పేరు మీదుగానే మనకు మానవులు (ఆంగ్లంలో Man కూడా ఇక్కడి నుండే వచ్చింది) అని పేరు వచ్చింది.
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలు పెట్టినప్పుడు అతనికి సృష్టి చాలా నిదానంగా జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకని బ్రహ్మదేవుడు కుమారులను సృష్టి కార్యక్రమములను కొనసాగిన్చావలసినదిగా కోరాడు. కానీ వారు నిరాకరించారు. ఆ పరిస్థితులలో బ్రహ్మదేవుడు ఒక యోచన చేసారు. మొదటిసారి స్త్రీ పురుషులను సృష్టిస్తే, మిగిలిన సృష్టి కార్యం తనంత తానుగా జరుగుతుంది అని భావించారు. తన ఆలోచనను అమలులో ఉంచుతూ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించారు. ఒక బాగం స్వయంభుమనువు, మరొక భాగం శతరూప అనే ఒక స్త్రీ.
అప్పుడు బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యం చేయమని చెప్పారు. అప్పుడు స్వయంభు మనువు తాము నివసించుటకు భూమి లేదు అని బ్రహ్మదేవునకు గుర్తుచేశారు. అప్పుడు పరిసరములను గమనించిన బ్రహ్మదేవుడు భూమి మరలా గర్భొదక జలములలో మునిగి ఉండుట చూసాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు వరాహవాతారం ధరించి భూమిని ఉద్దరించారు.
శతరూప, స్వయంభు మనువులకు
పుత్రికలు పుత్రులు
ఆకూతి ఉత్తానపాదుడు
దేవహూతి ప్రియవ్రతుడు
ప్రసూతి
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.
సనకుడు సననందనుడు సనత్కుమారుడు సనత్ సుజాతుడు
వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు.
1. మన్యువు - ధీర - చంద్రుడు
2. మనువు - వృత్తి - సూర్యుడు
3. మహాకాలుడు - అశన - అగ్ని
4. మహశ్చివుడు - ఉమ - వాయువు
5. ఋతధ్వజుడు - నియతి - జలము
6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము
7. భవుడు - ఇల - భూమి
8. కాలుడు - అంబిక - ప్రాణములు
9. వామదేవుడు - ఇరావతి - తపస్సు
10. ధృతవ్రతుడు - సుధ - హృదయం
11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు
తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు.
నవబ్రహ్మలు
నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
1. బ్రొటన వేలి నుండి దక్షుడు
2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు
3. నాభి నుండి పులహుడు
4. చెవుల నుండి పులస్త్యుడు
5. చర్మం నుండి భృగువు
6. చేతి నుండి క్రతువు
7. ముక్కు నుండి అంగిరసుడు
8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు
9. మనస్సు నుండి మరీచి
10. కన్నుల నుండి అత్రి
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువలన, అతనిని తప్పించి మిగిలిన 9 మందిని నవబ్రహ్మలు అని అంటారు. వీరు 9 మంది దేవహుతి, కర్ధముల 9 మంది పుత్రికలను వివాహం చేసుకుని బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేసారు.
కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.
అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.
మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.
ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.
స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.
అప్పటి నుండి పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది. కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.
ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి, కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.
కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.
వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు
సశేషం
ఇట్లు
శివ పరివారం
గురువు గారు రోజు చెబుతున్న భాగవతం లో అన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు ? , గురువు గారు భాగవతం చెప్పిన తర్వాత ఒక్కసారి ఆ పేర్లు తలచుకుందాం అని ప్రయత్న పూర్వకం గా చాల రోజులు నుంచి ప్రయతిస్తున్నాను
స్వయంభు మనువు
స్వయంభు మనువు, మనకు ఉన్న పదునాలుగు మంది మనువులు అందరిలో మొదటివాడు. అతని పేరు మీదుగానే మనకు మానవులు (ఆంగ్లంలో Man కూడా ఇక్కడి నుండే వచ్చింది) అని పేరు వచ్చింది.
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలు పెట్టినప్పుడు అతనికి సృష్టి చాలా నిదానంగా జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకని బ్రహ్మదేవుడు కుమారులను సృష్టి కార్యక్రమములను కొనసాగిన్చావలసినదిగా కోరాడు. కానీ వారు నిరాకరించారు. ఆ పరిస్థితులలో బ్రహ్మదేవుడు ఒక యోచన చేసారు. మొదటిసారి స్త్రీ పురుషులను సృష్టిస్తే, మిగిలిన సృష్టి కార్యం తనంత తానుగా జరుగుతుంది అని భావించారు. తన ఆలోచనను అమలులో ఉంచుతూ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించారు. ఒక బాగం స్వయంభుమనువు, మరొక భాగం శతరూప అనే ఒక స్త్రీ.
అప్పుడు బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యం చేయమని చెప్పారు. అప్పుడు స్వయంభు మనువు తాము నివసించుటకు భూమి లేదు అని బ్రహ్మదేవునకు గుర్తుచేశారు. అప్పుడు పరిసరములను గమనించిన బ్రహ్మదేవుడు భూమి మరలా గర్భొదక జలములలో మునిగి ఉండుట చూసాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు వరాహవాతారం ధరించి భూమిని ఉద్దరించారు.
శతరూప, స్వయంభు మనువులకు
పుత్రికలు పుత్రులు
ఆకూతి ఉత్తానపాదుడు
దేవహూతి ప్రియవ్రతుడు
ప్రసూతి
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.
సనకుడు సననందనుడు సనత్కుమారుడు సనత్ సుజాతుడు
వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు.
1. మన్యువు - ధీర - చంద్రుడు
2. మనువు - వృత్తి - సూర్యుడు
3. మహాకాలుడు - అశన - అగ్ని
4. మహశ్చివుడు - ఉమ - వాయువు
5. ఋతధ్వజుడు - నియతి - జలము
6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము
7. భవుడు - ఇల - భూమి
8. కాలుడు - అంబిక - ప్రాణములు
9. వామదేవుడు - ఇరావతి - తపస్సు
10. ధృతవ్రతుడు - సుధ - హృదయం
11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు
తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు.
నవబ్రహ్మలు
నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
1. బ్రొటన వేలి నుండి దక్షుడు
2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు
3. నాభి నుండి పులహుడు
4. చెవుల నుండి పులస్త్యుడు
5. చర్మం నుండి భృగువు
6. చేతి నుండి క్రతువు
7. ముక్కు నుండి అంగిరసుడు
8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు
9. మనస్సు నుండి మరీచి
10. కన్నుల నుండి అత్రి
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువలన, అతనిని తప్పించి మిగిలిన 9 మందిని నవబ్రహ్మలు అని అంటారు. వీరు 9 మంది దేవహుతి, కర్ధముల 9 మంది పుత్రికలను వివాహం చేసుకుని బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేసారు.
కర్దమ ప్రజాపతి - దేవహుతి
అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.
మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.
ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.
స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.
అప్పటి నుండి పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది. కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.
ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి, కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.
కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.
వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు
- కళ - మరీచి
- అనసూయ - అత్రి
- ఊర్జ - వసిష్టుడు
- శ్రద్ధ - అంగిరసుడు
- హవిర్భవు - పులస్త్యుడు
- గతి - పులహుడు
- క్రియ - క్రతువు
- ఖ్యాతి - భృగువు
- చిత్తి - అదర్వుడు
సశేషం
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment