Saturday, April 24, 2021

ముచికుందుడు

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు మనకి శ్రీ మద్ భాగవతం లో గురువు గారు ముచుకుందుడు  గురించి చెప్పారు 

మా చిన్నతం లో మేము పడుకునే తప్పుడు మా నాన్నగారు మాకు రెండు శ్లోకాలు చెప్పేవారు అవి ఏమిటంటే  మొదటిది 

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !

శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

రెండవ శ్లోకం 

అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః / కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః

ముచికుందుడు గురించి తెలుసుకుందాం 

ముచికుందుడు లేదా ముచుకుందుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. మాంధాత కుమారుడు. అంబరీషుడు ఇతనికి సోదరుడు అవుతాడు. ఇక్ష్వాకు వంశాన్నే సూర్యవంశం అని కూడా అంటారు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు చక్రవర్తి, శ్రీరాముడు కూడా సూర్యవంశానికి చెందిన రాజులు. కాలయవనుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడు మిలియన్ల యవనాల సైన్యంతో మధురపై దాడి చేసిన రాజు.

కాలయవనుడుముచుకుందుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడుకోట్ల మంది మ్లేచ్ఛసైన్యంతో మధురపై దాడి చేసిన రాజు. పెద్ద జడతో నల్లగా ఉండే కాలయవుడికి యాదవులు ఎవరూ కూడా తనని చంపలేని ఒక వరం ఉంది.నారద మహర్షి మాట విని శ్రీకృష్ణుని మధుర పైకి యుద్ధానికి వస్తున్నాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు జరాసంధుని తో యుద్ధం ముగించుకుని అంతలోనే కాలమును యుద్ధం ప్రజలకు నష్టం కలిగిస్తుందని విశ్వకర్మ ను పిలిపించి సముద్రగర్భంలో పన్నెండు ఆమడల వెడల్పు తో ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయిస్తాడు ద్వారకకు కాపలాగా బలరాముడిని ఉంచి తను మధుర నగరానికి చేరుకుంటాడు అంతలోనే కాలయవనుడు నిరాయుధుడైన శ్రీకృష్ణపరమాత్ముని చూసి వీడేనా యాదవ రాజు అని వెంట పడడంతో శ్రీకృష్ణుడు పరుగులు తీస్తాడు పరుగుతీసి ఒక గుహ లోకి వెళతాడు గుహలో గాఢ నిద్ర లో ఉన్నటువంటి ముచికుందుని చూసి యాదవుడు అని అనుమానంతో కాలిపై తంతాడు ముచుకుందుడు నిద్రనుండి లేచి కళ్ళు తెరవగా ఆ కళ్ళ నుండి అగ్ని దారులు బయటికొచ్చి కాలయవనుడు కాలి బూడిదై పోతాడుఅయిపోతాడు ముచుకుందుడు మాంధాత కుమారుడు సూర్య వంశానికి చెందిన వాడు అయితే దేవతలకు యుద్ధంలో సహాయం చేసి అలసిపోతాడు దేవతలు ముచుకుందా నీవు మాకు బాగా సహాయం చేశావు ఏమైనా వరం కోరుకో అని అంటారు ముచికుందుడు నేను బాగా అలసిపోయాను నాకు నిద్ర పోవడానికి మంచి చోటు కావాలి అని కొడతాడు దానికి ఇంద్రుడు నీకు బాగా నిద్ర వస్తుంది నిన్ను ఎవడైతే నిద్రలో నుండి లేపుతాడో వాడు నీ కళ్ళలో నుండి వచ్చే మంటలో దగ్దమై పోతాడు అని వరము ఇస్తాడు

అందుకే మన పూర్వికులు ఆచారం లో కూడా ఎవరైనా ఇంటికి వేళ్ళ వలసి వస్తే సమయ సమాచారం చూసుకునే వెళ్లారు వారు ..ఎప్పుడు పడితే వెళ్లేవారు కాదు.. ఒక నిర్దిష్ట సమయం లో వెళ్లే వారు.. అలాగే మంచి నిద్ర లో ఉండే వాళ్ళను ఒక్కసారి గా లేపకూడదు .

ఇది వరకు పెద్దలు మనకి సమయాచారం సదాచారం గురించి తెలియచేసేవారు . (అంటే ఈ సమయం లో ఏమి పనులు చెయ్యాలి / చెయ్యకూడదు అనే విషయాలు ). మనకి గురువు గారు చాల సార్లు సమయాచారం , సదాచారం గురించి తెలియయచేసారు 

ఇట్లు

శివ పరివారం 

No comments:

Post a Comment