ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
మనకి మన పూజ్య గురువు గారు శ్రీమధ్భగవతం లో పర్వతాలు , నదులు , చెట్లు, వనాలు , సముద్రాలూ మొ. వాటి గురించి తెలియచేసారు , కొంత సమాచారం ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
మనకి అనేక పర్వతాలు ఉంటాయి అందులో ముఖ్యం గా వృతానికి ఉత్తర భాగములో మూడు పర్వతాలుంటాయి - నీలః శ్వేతః శృఙ్గవ. ఒక్కో పర్వతం ఒక్కో వర్షానికీ (రమ్యకహిరణ్మయకురూణాం) సరిహద్దు. ఇవి తూర్పు దిక్కు వైశాల్యం ఉండి విస్తరించాయి. ఉప్పు సముద్రానికి ఆ పక్కా ఈపక్కా వ్యాపించాయి. ఒక్కో పర్వతం తన పూర్వ పర్వతం కంటే పది రెట్లు ఎక్కువ విస్తీర్ణం.
పొడుగులోనే ఎక్కువ తక్కువలు, వైశాల్యములో కావు. దక్షిణ ఇలా వృతములో మూడు పర్వతాలు ఉన్నాయి. నిషధో హేమకూటో హిమాలయ. ఇవన్నీ పదివేల యోజనాల ఎత్తులో ఉన్నాయి. హరి వర్షం కింపురుషం భారత వర్షం. భారతదేశ సరిహద్దు పర్వతం హిమాలయం. ఇలావృత వర్షానికి పూర్వభాగములో, ఇంకో మూడు పర్వతాలు ఉన్నాయి. మాల్యవత్ గంధమాధనం అవానలం అనే పర్వతాలు పేరు పొందాయి. ఇవి కేతుమాల భద్రాశ్వ వర్షానికి హద్దులు. మరియొక నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తూ వెడల్పు ఉన్నవై మేరు పర్వతానికి ఉన్నాయి. మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద. మేరు పర్వతానికి పోదగినవారికే ఈ పర్వతాలు దారి ఇస్తాయి. మేరుపర్వతానికి ఇవి రక్షకమైనవి.
ఈ నాలుగు పర్వతములలో ఒక్కో పర్వతానికి గుర్తుగా ఒక్కో మహా వృక్షములు ఉన్నాయి. మామిడీ జంబూ కదంబం న్యగ్రోధ (మఱ్ఱి). ఈ నాలుగు మహావృక్షాలూ పర్వతానికి జండాలులా ఉన్నాయి.
పదకొండు వేల యోజనాల ఎత్తుతో, ఒక్కో కొమ్మ వైశాల్యం వంద యోజనాలు. అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లున్నాయి. నాలుగు సముద్రాలే వీటికి నీరుపోస్తాయి. పాలూ తేనే చెరుకు రసం నీరు. ఈ నాలుగు జనములతో నాలుగు హ్రదములున్నాయి.
ఈ జలములో గొప్పదనం, ఒక్క సారి ఈ జలాన్ని ఆచమనం చేస్తే దేవతల సమముతో బలం వచ్చి యోగముతో నిష్ణాతులవుతారు. ఉపదేవతల ఐశ్వర్యం సహజముగా వస్తాయి.
నాలుగు పర్వతాలూ నాలుగు చెట్లూ నాలుగు నదులతో బాటు నాలుగు ఉద్యాన వనాలున్నాయి. అవి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రం. ఈ ఉద్యానవనములలో దేవతలతో చుట్టబడి దేవతా స్త్రీలూ, వారి భర్తలూ వినోదములతో కాలం గడుపుతారు
మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరు మామిడి. పదకొండు వందల యోజనాల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తుకు తగ్గట్టుగా ఒక్కో పండూ ఒక్కో పర్వత శిఖరములా ఉంటుంది. అవి ఎంతో తీయగా ఉంటాయి.
ఆ మామిడి పళ్ళ రసం పర్వత ప్రాంతములో ప్రవహించింది. అలా ప్రవహించి ఎరుపు రంగు నీరులా మారి అరుణొద అనే పేరు వచ్చింది. మందర గిరి శిఖరం నుంచి ఈ నది పడి తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది. ఈ అరుణొదా నది జలమును సేవించిన పార్వతీ దేవి సేవకులైన యక్షులు మొదలైనవారిని స్పృశిస్తే చాలు, మన శరీర సుగంధం పదియోజనాలు వ్యాపిస్తుంది.
జంబూ (అల్ల నేరేడు) పళ్ళు కింద పడగా ఒక్కో పండు ఏనుగు శరీరమంత ఉండగా ఆ జంబూ ఫలము యొక్క రసము పారిన నది జంబూ నది. ఈ ప్రవాహమూ జలమూ నదీ పరివాహక ప్రాంతములో ఉన్న మట్టితో కలిసి బంగారమయ్యింది. జంబూ నదీ తీరములో పుట్టినది జాంబూనదం. దానితో దేవతలు ఆభరణాలు చేసుకుంటారు. మేరు మందర శిఖరాల నుండీ పదివేల యోజనాల నుండీ కిందపడుతూ దక్షిణ భాగములో పడి ఇలా వృత వర్షాన్ని తడిపేస్తుంది. అక్కడ ఉండే మట్టి, జంబూ రసముతో తడపబడి, వాయువు సూర్య కిరణాలు సోకడం వలన దేవతలకు ఆభరణముగా జాంబూనదముగా పేరు గాంచింది.
ఇక మూడవ వృక్షం కడిమ చెట్టు. ఇది సుపార్శ్వములో ఉంది. ఈ వృక్షం యొక్క తొఱ్ఱలో వెళ్ళినటువంటి ఐదు మధు ధారలు ప్రవహిస్తూ పర్వత శిఖరము నుంచీ ప్రవహిస్తూ ఇలా వృతానికి పశ్చిమ భాగములో వస్తాయి. ఈ రసాన్ని తాగిన వారి నిట్టూర్పు నుంచి వచ్చిన వాయువు కొన్ని యోజనాలు వ్యాపిస్తుంది.
ఇక నాలగవది అయిన న్యగ్రోధము (మఱ్ఱి). ఇక్కడ నాలుగు నదములు ఉన్నాయి. (తూర్పు నుంచి పశ్చిమానికి పారితే నదము).
అన్ని కోరికలూ తీర్చే నదులు ఇవి. ఈ నదులనుండి మనకు కావలసినవి అన్నీ లభిస్తాయి. పర్వతం నుంచి పడుతూ ఉత్తరం వైపునుంచి ఇలావృతానికి వ్యాపించి ఉంటుంది. ఈ నీరు తాగినందు వలనే వారిని దేవతలన్నారు. శరీరం మడత పడటం, శరీరం దుర్గంధం రావడం మొదలైనవి ఉండవు. చలి వేడి రంగు మారడం లాంటివి ఈ నదీ జలం తాగే వారికి ఏర్పడవు. బ్రతికున్నంతవరకు మాత్రం ఇవన్నీ అనుభవిస్తారు.
"కురఙ్గకురరకుసుమ్భవైకఙ్కత్రికూటశిశిరపతఙ్గరుచకనిషధశినీవాసకపిలశఙ్ఖ
వైదూర్యజారుధిహంసఋషభనాగకాలఞ్జరనారదాదయో వింశతిగిరయో మేరోః కర్ణికాయా ఇవ కేసరభూతా
మూలదేశే పరిత ఉపక్లృప్తాః"
(కురంగం, కురరమ్, కుసుంభమ్, వైకంఠం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శినీవాసం, కపిలమ్, శంఖం, వైదూర్యం, జారుది, హంసమ్, ఋషభమ్, నాగం, కాలంజరం, నారదం మొదలైన ఇరవై పర్వతాలున్నాయి.) ఇవి మేరు పర్వతానికి పూవు మధ్య చుట్టు ఉన్న పద్మ కర్ణికలాగ ఉన్నాయి. మేరు పర్వతం మధ్యభాగమైతే ఈ ఇరవై పర్వతాలూ చుట్టూ వ్యాపించి ఉంటాయి.
జఠరదేవ మేరు యొక్క పూర్వభాగములో ఉండి దశయోజన విస్తీర్ణముతో వ్యాపించి ఉంటాయి. ఇలా చుట్టూ ఉన్న పర్వతాలతో మేరుపర్వతం అగ్ని జ్వాలలతో ఆవరించి ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది.
మేరు యొక్క మూర్ధ్న భాగములో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరముంటుంది. పదివేల యోజనాలతో సమ చతురస్రముగా ఉంటుంది. అది శాతకుంభీ నగరం.
ఇలాంటి బ్రహ్మ పురిని చుట్టుకొని అష్టదిగ్పాలకుల నగరాలుంటాయి. ఏ దిక్కుకు ఏ పాలకులో ఆ దిక్కులో ఆ నగరాలుంటాయి. ఒక్కో దానికీ రెండవది నాలగవ వంతు.
బ్రహ్మదేవుని పట్టణము పేరు మనోవతి. దీని చుట్టూ ఉన్న పట్టణాలను వివరిస్తాను చదవండి. దేవేంద్రుని పట్టణము అమరావతి. ఇది తూర్పు దిక్కున ఉంది. అగ్నిదేవుడి పట్టణం తేజోవతి. ఇది ఆగ్నేయదిక్కున ఉంది. యముని పట్టణం సంయమని. ఇది దక్షిణం వైపు ఉంది. నిరుతి పట్టణం కృష్ణాంగన. ఇది నైరుతి దిక్కున ఉంది. వరుణుడి పట్టణం శ్రద్ధావతి. ఇది పడమటి దిక్కున ఉంది. వాయుదేవుని పట్టణం గంధవతి. ఇది వాయువ్య దిక్కున ఉంది. కుబేరుని పట్టణం మహోదయ. ఇది ఉత్తర దిక్కున ఉంది. ఈశానుడి పట్టణం యశోవతి. ఇది ఈశాన్య దిక్కున ఉంది.
ఇలా మనకి శ్రీమద్ భాగవతం లో అన్ని నదులు, వనాలు చెట్లు, సముద్రాలూ మొ.. ఉన్నాయి..
మరల ఒక్కో చెట్టు ఒక్కో విశిష్టని సంతరించుకుని ఉంటాయి.. చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు -శాస్త్రం వివరించింది.
ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు..
https://ranisarma.blogspot.com/2020/07/blog-post_13.html?m=1
ఇటు
కృష్ణం వందే జగద్గురుం
శివ పరివారం
No comments:
Post a Comment