ప్రియమైన భాగవత శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
మనకి నిన్నటి రోజున ధ్రువోపాఖ్యానమ్ ను మన గురువు గారు తెలియచేసారు.. ధ్రువుడు అనంతరం జరిగిన కథ మనం తెలుసుకుందాం ,మనకి శ్రీమద్ భాగవతం లో ఎందరో మహానుభావులు పేర్లు వస్తాయి. కనీసం వాళ్ళ పేర్లు తలుచుకున్న .. మనం ధన్యులు అని గురువు గారు మనకి చాల సార్లు చెప్పారు..
ఈ రోజు గురువు గారు చెప్పిన ప్రవచనం లో వచ్చిన వాళ్ళ పేర్లు
స్వయంభువ మనువుకు 'శతరూప'అనే భార్యవలన 'ప్రియవ్రతుడు' 'ఉత్తానపాదుడు' అనే కుమారులుజన్మించారు.వీరిలో ఉత్తాన పాదునికి 'సునీతి' 'సురుచి' అనే వారు భార్యలు.సురుచితో ఉత్తానపాదుడు అమిత ప్రేమగా ఉండేవాడు.సురుచికి 'ఉత్తముడు' సునీతీకి 'ధృవుడు' జన్మించారు.ఓకరోజు ఉత్తాన పాదుడు ఉత్తముని ఓడిలో కూర్చొపెట్టుకుని ఉండగా,అదేసమయంలో ధృవుడుకూడా తన తండ్రి ఓడిలో కూర్చోవాలని వెళ్ళాడు.అదిచూసిన సురుచి 'నీకు ఆ అధృష్టంలేదు వెళ్ళు' అని అన్నది.పినతల్లి మాటలకు మనసు గాయపడిన ధృవుడు తల్లి సునీతి అనుమతితో తపస్సుకు బయలుదేరగా నారదముని ఇచ్చిన సలహాతో యమునానది తీరాన ఉన్న 'మధువనం'చేరి నారదుడు ఉపదేశించిన నారాయణ మంత్రం జపిస్తూ,తపస్సు ప్రారంభించి తొలి మాసం ఆహారంగా వెలగ,రేగిపండ్లు స్వీకరిస్తు,రెండవ మాసం ఆరుదినాలకు ఒకసారి 'జీర్ణతృణపర్ణాలను'తింటూ తొమ్మిది దినాలకు ఒక సారి నీరు స్వీకరిస్తూ, మూడుమాసాలు గడిపాడు.నాల్గవమాసంలో పన్నెండు దినాలకు ఒకసారి శ్వాసిస్తూ,ఓంటి కాలిపై శ్రీమహవిష్ణువుని ధ్యానిస్తూ అయిదు మాసాలు తపసు చేసాడు.ధృవుని కి శ్రీమహావిష్ణువు దర్శనం ఇచ్చి'చిరంజీవి నీతపస్సు ఫలించింది.'జ్యోతిశ్చక్రము' నక్షత్రస్వరూపాలైన వసిష్ట,అత్రి,గౌతమ,కశ్యప,భరద్వాజ,జమదగ్ని,విశ్వామిత్రులు అయిన సప్తమహర్షులు తారకలతో కలసి దేనికి ప్రదక్షణం చేస్తుంటారో అటువంటి 'ధృవ' నక్షత్రంగా వెలుగొందుతావు.వృధ్ధుడైన నీతండ్రి రాజ్యాభారాన్ని నీవు స్వీకరించు.నీతమ్ముడు ఉత్తముడు అడవిలో వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతని తల్లి అడవిలో అగ్నిజ్వాలలకు బలి అవుతుంది'అని అదృశ్యమైయాడు. రాజ్యభారం స్వీకరించిన ధృవుడు శింశుమార ప్రజాపతి కుమార్తె 'భ్రమిరి'నివివాహంచేసుకున్నాడు.ఈమెకు 'కల్పుండు' 'వత్సరుడు'జన్మించారు.వాయుదేవుని పుత్రిక 'ఇల'ను చేపట్టగా ఆమెకు'ఉత్కలుడు'జన్మించాడు.'ధన్య'అనే భార్యకు'శిష్టుడు'జన్మించాడు. 'శంభువు'అనే భార్యకు 'భవ్యుడు' 'శ్లిష్టి'అనేవారు జన్మించారు.వీరుకాక 'గర్కుడు' 'వృషభుడు' 'వృకుడు' 'వృకలుడు' 'ధ్రతిమంతుడు'అనే కుమారులు ఉన్నారు. సుధీర్ఘ రాజ్యపాలన చేసిన అనంతరం తన సంతతికి రాజ్యాన్ని అప్పగించి ధృవతారగా అంబరాన నిలిచాడు ధృవుడు.ధృవుని పెద్దకుమారుడు ఉత్కలుడు రాజ్యాన్ని తిరస్కరించి తపోవనాలకు వెళ్ళడంతో,రెండోకుమారుడు వత్సరునికి పట్టాభిషేకంజరిగింది. వత్సరుడు 'సర్వార్ధి'ని వివాహంచేసుకున్నాడు.వీరికి 'పుష్పార్ణుడు' 'చంద్రకేతుడు' 'ఇష్టుడు' 'ఊర్జుడు' 'వసువు' 'జయుడు'అనేవారు జన్మించారు. వీరిలో పుష్పార్జునునకు 'ప్రభ' 'దోష' అనే ఇద్దరు భార్యలు.వీరిలో ప్రభకు 'ప్రాతర్శ' 'థంధని' 'సాయిలు'జన్మించగా,దోషకు'ప్రదోషుడు' 'నిశీధుడు' 'వ్యుష్టుడు'అనేవారు జన్మించారు.వీరిలో వ్యూష్టుని భార్య 'పుష్కరిణి'వీరికి 'సర్వతేజుడు'జన్మించాడు.అతనికి 'ఆకూతి'భార్య వీరికి'చక్షుస్సు'అనే మనువు జన్మించాడు.చక్షుస్సు భార్య 'నడ్వల' వీరికి'పురువు' 'కుత్సుడు' 'త్రితుడు' 'ద్యుమ్నుడు' 'సత్యవంతుడు' 'బుతుడు' 'త్రతుడు' అగ్నిప్టోముడు' 'అతిరాత్రుడు' 'సద్యుముడు' 'శిబి' 'ఊల్మకుడు'అనే వారు జన్మించారు.వీరిలో ఊల్మకుడికి 'అంగుడు' 'సుమనుడు' 'ఖ్యాతి' 'కత్రువు' 'అంగీరసుడు' 'గయుడు' జన్మించారు.అంగుడు 'సునీథ'దంపతులకు 'వేనుడు'జన్మించాడు.అతని ప్రవర్తన నచ్చక అంగుడు అడవులకువెళ్ళి తపస్సు చేసుకొసాగాడు.ఈవిషయం తెలుసుకున్న మునులు వేనుని శపించగా అతను మరణించాడు.మునులు అతని శరీరంనుండి నారాయణాంశంతో ఓబాలుని సృష్టించారు.అతని మొదటి చక్రవర్తి అయిన'పృథుడు'ఇతనిభార్య 'అర్చి' వీరు హరి నామ స్మరణతో పలు అశ్వమేథ యాగాలు చేసారు. పృథువుకు 'కుబేరుడు' బంగారు సింహాసనం.'వరుణుడు' చంద్రకాంతులు వెదజల్లే గొడుగు. 'వాయుదేవుడు' వింజామరం.'ధర్మదేవత' యశోరూపమైన పూమాల, 'ఇంద్రుడు'కిరీటం , 'యముడు'రాజదండం, 'బ్రహ్మదేవుడు'వేదకవచాలు, 'సరస్వతిదేవి'మేలిముత్యాలదండ,' విష్ణువు' సుదర్శన చక్రాన్ని, 'లక్ష్మిదేవి'తరగని సంపదను,'శివుడు' ఖడ్గాన్ని, 'పార్వతిదేవి'శతచంద్రం అనే డాలును,'చంద్రుడు'తెల్లని గుర్రాలను వెండి రధాన్ని,'సూర్యుడు' అస్త్రాలను,'అగ్ని' అజగవం అనేధనస్సును,'భూదేవి'యోగమాయ అయిన పాదుకలు బహుకరించారు.' ఈదంపతులకు'విజాతాశ్వుడు' 'థూమ్రాశ్వుడు' 'హర్యాశ్వుడు' 'ద్రవిణుడు' 'అంతర్ధానుడు' 'హవిర్భానుడు' 'వృకుడు' జన్మించారు.
ఇట్లు
శివ పరివారం
మనకి నిన్నటి రోజున ధ్రువోపాఖ్యానమ్ ను మన గురువు గారు తెలియచేసారు.. ధ్రువుడు అనంతరం జరిగిన కథ మనం తెలుసుకుందాం ,మనకి శ్రీమద్ భాగవతం లో ఎందరో మహానుభావులు పేర్లు వస్తాయి. కనీసం వాళ్ళ పేర్లు తలుచుకున్న .. మనం ధన్యులు అని గురువు గారు మనకి చాల సార్లు చెప్పారు..
ఈ రోజు గురువు గారు చెప్పిన ప్రవచనం లో వచ్చిన వాళ్ళ పేర్లు
స్వయంభువ మనువుకు 'శతరూప'అనే భార్యవలన 'ప్రియవ్రతుడు' 'ఉత్తానపాదుడు' అనే కుమారులుజన్మించారు.వీరిలో ఉత్తాన పాదునికి 'సునీతి' 'సురుచి' అనే వారు భార్యలు.సురుచితో ఉత్తానపాదుడు అమిత ప్రేమగా ఉండేవాడు.సురుచికి 'ఉత్తముడు' సునీతీకి 'ధృవుడు' జన్మించారు.ఓకరోజు ఉత్తాన పాదుడు ఉత్తముని ఓడిలో కూర్చొపెట్టుకుని ఉండగా,అదేసమయంలో ధృవుడుకూడా తన తండ్రి ఓడిలో కూర్చోవాలని వెళ్ళాడు.అదిచూసిన సురుచి 'నీకు ఆ అధృష్టంలేదు వెళ్ళు' అని అన్నది.పినతల్లి మాటలకు మనసు గాయపడిన ధృవుడు తల్లి సునీతి అనుమతితో తపస్సుకు బయలుదేరగా నారదముని ఇచ్చిన సలహాతో యమునానది తీరాన ఉన్న 'మధువనం'చేరి నారదుడు ఉపదేశించిన నారాయణ మంత్రం జపిస్తూ,తపస్సు ప్రారంభించి తొలి మాసం ఆహారంగా వెలగ,రేగిపండ్లు స్వీకరిస్తు,రెండవ మాసం ఆరుదినాలకు ఒకసారి 'జీర్ణతృణపర్ణాలను'తింటూ తొమ్మిది దినాలకు ఒక సారి నీరు స్వీకరిస్తూ, మూడుమాసాలు గడిపాడు.నాల్గవమాసంలో పన్నెండు దినాలకు ఒకసారి శ్వాసిస్తూ,ఓంటి కాలిపై శ్రీమహవిష్ణువుని ధ్యానిస్తూ అయిదు మాసాలు తపసు చేసాడు.ధృవుని కి శ్రీమహావిష్ణువు దర్శనం ఇచ్చి'చిరంజీవి నీతపస్సు ఫలించింది.'జ్యోతిశ్చక్రము' నక్షత్రస్వరూపాలైన వసిష్ట,అత్రి,గౌతమ,కశ్యప,భరద్వాజ,జమదగ్ని,విశ్వామిత్రులు అయిన సప్తమహర్షులు తారకలతో కలసి దేనికి ప్రదక్షణం చేస్తుంటారో అటువంటి 'ధృవ' నక్షత్రంగా వెలుగొందుతావు.వృధ్ధుడైన నీతండ్రి రాజ్యాభారాన్ని నీవు స్వీకరించు.నీతమ్ముడు ఉత్తముడు అడవిలో వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతని తల్లి అడవిలో అగ్నిజ్వాలలకు బలి అవుతుంది'అని అదృశ్యమైయాడు. రాజ్యభారం స్వీకరించిన ధృవుడు శింశుమార ప్రజాపతి కుమార్తె 'భ్రమిరి'నివివాహంచేసుకున్నాడు.ఈమెకు 'కల్పుండు' 'వత్సరుడు'జన్మించారు.వాయుదేవుని పుత్రిక 'ఇల'ను చేపట్టగా ఆమెకు'ఉత్కలుడు'జన్మించాడు.'ధన్య'అనే భార్యకు'శిష్టుడు'జన్మించాడు. 'శంభువు'అనే భార్యకు 'భవ్యుడు' 'శ్లిష్టి'అనేవారు జన్మించారు.వీరుకాక 'గర్కుడు' 'వృషభుడు' 'వృకుడు' 'వృకలుడు' 'ధ్రతిమంతుడు'అనే కుమారులు ఉన్నారు. సుధీర్ఘ రాజ్యపాలన చేసిన అనంతరం తన సంతతికి రాజ్యాన్ని అప్పగించి ధృవతారగా అంబరాన నిలిచాడు ధృవుడు.ధృవుని పెద్దకుమారుడు ఉత్కలుడు రాజ్యాన్ని తిరస్కరించి తపోవనాలకు వెళ్ళడంతో,రెండోకుమారుడు వత్సరునికి పట్టాభిషేకంజరిగింది. వత్సరుడు 'సర్వార్ధి'ని వివాహంచేసుకున్నాడు.వీరికి 'పుష్పార్ణుడు' 'చంద్రకేతుడు' 'ఇష్టుడు' 'ఊర్జుడు' 'వసువు' 'జయుడు'అనేవారు జన్మించారు. వీరిలో పుష్పార్జునునకు 'ప్రభ' 'దోష' అనే ఇద్దరు భార్యలు.వీరిలో ప్రభకు 'ప్రాతర్శ' 'థంధని' 'సాయిలు'జన్మించగా,దోషకు'ప్రదోషుడు' 'నిశీధుడు' 'వ్యుష్టుడు'అనేవారు జన్మించారు.వీరిలో వ్యూష్టుని భార్య 'పుష్కరిణి'వీరికి 'సర్వతేజుడు'జన్మించాడు.అతనికి 'ఆకూతి'భార్య వీరికి'చక్షుస్సు'అనే మనువు జన్మించాడు.చక్షుస్సు భార్య 'నడ్వల' వీరికి'పురువు' 'కుత్సుడు' 'త్రితుడు' 'ద్యుమ్నుడు' 'సత్యవంతుడు' 'బుతుడు' 'త్రతుడు' అగ్నిప్టోముడు' 'అతిరాత్రుడు' 'సద్యుముడు' 'శిబి' 'ఊల్మకుడు'అనే వారు జన్మించారు.వీరిలో ఊల్మకుడికి 'అంగుడు' 'సుమనుడు' 'ఖ్యాతి' 'కత్రువు' 'అంగీరసుడు' 'గయుడు' జన్మించారు.అంగుడు 'సునీథ'దంపతులకు 'వేనుడు'జన్మించాడు.అతని ప్రవర్తన నచ్చక అంగుడు అడవులకువెళ్ళి తపస్సు చేసుకొసాగాడు.ఈవిషయం తెలుసుకున్న మునులు వేనుని శపించగా అతను మరణించాడు.మునులు అతని శరీరంనుండి నారాయణాంశంతో ఓబాలుని సృష్టించారు.అతని మొదటి చక్రవర్తి అయిన'పృథుడు'ఇతనిభార్య 'అర్చి' వీరు హరి నామ స్మరణతో పలు అశ్వమేథ యాగాలు చేసారు. పృథువుకు 'కుబేరుడు' బంగారు సింహాసనం.'వరుణుడు' చంద్రకాంతులు వెదజల్లే గొడుగు. 'వాయుదేవుడు' వింజామరం.'ధర్మదేవత' యశోరూపమైన పూమాల, 'ఇంద్రుడు'కిరీటం , 'యముడు'రాజదండం, 'బ్రహ్మదేవుడు'వేదకవచాలు, 'సరస్వతిదేవి'మేలిముత్యాలదండ,' విష్ణువు' సుదర్శన చక్రాన్ని, 'లక్ష్మిదేవి'తరగని సంపదను,'శివుడు' ఖడ్గాన్ని, 'పార్వతిదేవి'శతచంద్రం అనే డాలును,'చంద్రుడు'తెల్లని గుర్రాలను వెండి రధాన్ని,'సూర్యుడు' అస్త్రాలను,'అగ్ని' అజగవం అనేధనస్సును,'భూదేవి'యోగమాయ అయిన పాదుకలు బహుకరించారు.' ఈదంపతులకు'విజాతాశ్వుడు' 'థూమ్రాశ్వుడు' 'హర్యాశ్వుడు' 'ద్రవిణుడు' 'అంతర్ధానుడు' 'హవిర్భానుడు' 'వృకుడు' జన్మించారు.
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment