Monday, July 27, 2020

భాగవతం లో నదులు చెట్లు పర్వతాలు మో.

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి  మన పూజ్య  గురువు గారు శ్రీమధ్భగవతం లో  పర్వతాలు , నదులు , చెట్లు, వనాలు , సముద్రాలూ మొ. వాటి గురించి తెలియచేసారు , కొంత సమాచారం ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

మనకి అనేక పర్వతాలు ఉంటాయి అందులో ముఖ్యం గా  వృతానికి ఉత్తర భాగములో మూడు పర్వతాలుంటాయి -  నీలః శ్వేతః శృఙ్గవ.  ఒక్కో పర్వతం ఒక్కో వర్షానికీ (రమ్యకహిరణ్మయకురూణాం) సరిహద్దు.  ఇవి తూర్పు దిక్కు వైశాల్యం ఉండి విస్తరించాయి.  ఉప్పు సముద్రానికి ఆ పక్కా ఈపక్కా వ్యాపించాయి.  ఒక్కో పర్వతం తన పూర్వ పర్వతం కంటే పది రెట్లు ఎక్కువ విస్తీర్ణం.

పొడుగులోనే ఎక్కువ తక్కువలు, వైశాల్యములో కావు.  దక్షిణ ఇలా వృతములో మూడు పర్వతాలు ఉన్నాయి.  నిషధో హేమకూటో హిమాలయ.  ఇవన్నీ పదివేల యోజనాల ఎత్తులో ఉన్నాయి.  హరి వర్షం కింపురుషం భారత వర్షం.  భారతదేశ సరిహద్దు పర్వతం హిమాలయం.  ఇలావృత వర్షానికి పూర్వభాగములో, ఇంకో మూడు పర్వతాలు ఉన్నాయి.  మాల్యవత్ గంధమాధనం అవానలం అనే పర్వతాలు పేరు పొందాయి.  ఇవి కేతుమాల భద్రాశ్వ వర్షానికి హద్దులు.  మరియొక నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తూ వెడల్పు ఉన్నవై మేరు పర్వతానికి ఉన్నాయి.  మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద.  మేరు పర్వతానికి పోదగినవారికే ఈ పర్వతాలు దారి ఇస్తాయి.  మేరుపర్వతానికి ఇవి రక్షకమైనవి.

ఈ నాలుగు పర్వతములలో ఒక్కో పర్వతానికి గుర్తుగా ఒక్కో మహా వృక్షములు ఉన్నాయి.  మామిడీ జంబూ కదంబం న్యగ్రోధ (మఱ్ఱి).  ఈ నాలుగు మహావృక్షాలూ పర్వతానికి జండాలులా ఉన్నాయి.

పదకొండు వేల యోజనాల ఎత్తుతో, ఒక్కో కొమ్మ వైశాల్యం వంద యోజనాలు.  అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లున్నాయి.  నాలుగు సముద్రాలే వీటికి నీరుపోస్తాయి.  పాలూ తేనే చెరుకు రసం నీరు.  ఈ నాలుగు జనములతో నాలుగు హ్రదములున్నాయి.

ఈ జలములో గొప్పదనం, ఒక్క సారి ఈ జలాన్ని ఆచమనం చేస్తే దేవతల సమముతో బలం వచ్చి యోగముతో నిష్ణాతులవుతారు.  ఉపదేవతల ఐశ్వర్యం సహజముగా వస్తాయి.

నాలుగు పర్వతాలూ నాలుగు చెట్లూ నాలుగు నదులతో బాటు నాలుగు ఉద్యాన వనాలున్నాయి.  అవి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రం.  ఈ ఉద్యానవనములలో దేవతలతో చుట్టబడి దేవతా స్త్రీలూ, వారి భర్తలూ వినోదములతో కాలం గడుపుతారు

మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరు మామిడి.  పదకొండు వందల యోజనాల ఎత్తులో ఉంటుంది.  అంత ఎత్తుకు తగ్గట్టుగా ఒక్కో పండూ ఒక్కో పర్వత శిఖరములా ఉంటుంది.  అవి ఎంతో తీయగా ఉంటాయి.
ఆ మామిడి పళ్ళ రసం పర్వత ప్రాంతములో ప్రవహించింది.  అలా ప్రవహించి ఎరుపు రంగు నీరులా మారి అరుణొద అనే పేరు వచ్చింది.  మందర గిరి శిఖరం నుంచి ఈ నది పడి తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది.  ఈ అరుణొదా నది జలమును సేవించిన పార్వతీ దేవి సేవకులైన యక్షులు మొదలైనవారిని స్పృశిస్తే చాలు, మన శరీర సుగంధం పదియోజనాలు వ్యాపిస్తుంది.

జంబూ (అల్ల నేరేడు) పళ్ళు కింద పడగా ఒక్కో పండు ఏనుగు శరీరమంత ఉండగా ఆ జంబూ ఫలము యొక్క రసము పారిన నది జంబూ నది.  ఈ ప్రవాహమూ జలమూ నదీ పరివాహక ప్రాంతములో ఉన్న మట్టితో కలిసి బంగారమయ్యింది.  జంబూ నదీ తీరములో పుట్టినది జాంబూనదం.  దానితో దేవతలు ఆభరణాలు చేసుకుంటారు.   మేరు మందర శిఖరాల నుండీ పదివేల యోజనాల నుండీ కిందపడుతూ దక్షిణ భాగములో పడి ఇలా వృత వర్షాన్ని తడిపేస్తుంది.  అక్కడ ఉండే మట్టి, జంబూ రసముతో తడపబడి, వాయువు సూర్య కిరణాలు సోకడం వలన దేవతలకు ఆభరణముగా జాంబూనదముగా పేరు గాంచింది.
ఇక మూడవ వృక్షం కడిమ చెట్టు.  ఇది సుపార్శ్వములో ఉంది.  ఈ వృక్షం యొక్క తొఱ్ఱలో వెళ్ళినటువంటి ఐదు మధు ధారలు ప్రవహిస్తూ పర్వత శిఖరము నుంచీ ప్రవహిస్తూ ఇలా వృతానికి పశ్చిమ భాగములో వస్తాయి.  ఈ రసాన్ని తాగిన వారి నిట్టూర్పు నుంచి వచ్చిన వాయువు కొన్ని  యోజనాలు వ్యాపిస్తుంది.
ఇక నాలగవది అయిన న్యగ్రోధము (మఱ్ఱి).  ఇక్కడ నాలుగు నదములు ఉన్నాయి.  (తూర్పు నుంచి పశ్చిమానికి పారితే నదము).
అన్ని కోరికలూ తీర్చే నదులు ఇవి.  ఈ నదులనుండి మనకు కావలసినవి అన్నీ లభిస్తాయి.  పర్వతం నుంచి పడుతూ ఉత్తరం వైపునుంచి ఇలావృతానికి వ్యాపించి ఉంటుంది.  ఈ నీరు తాగినందు వలనే వారిని దేవతలన్నారు.  శరీరం మడత పడటం, శరీరం దుర్గంధం రావడం మొదలైనవి ఉండవు.  చలి వేడి రంగు మారడం లాంటివి ఈ నదీ జలం తాగే వారికి ఏర్పడవు.  బ్రతికున్నంతవరకు మాత్రం ఇవన్నీ అనుభవిస్తారు.
"కురఙ్గకురరకుసుమ్భవైకఙ్కత్రికూటశిశిరపతఙ్గరుచకనిషధశినీవాసకపిలశఙ్ఖ
వైదూర్యజారుధిహంసఋషభనాగకాలఞ్జరనారదాదయో వింశతిగిరయో మేరోః కర్ణికాయా ఇవ కేసరభూతా
మూలదేశే పరిత ఉపక్లృప్తాః"

(కురంగం, కురరమ్, కుసుంభమ్, వైకంఠం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శినీవాసం, కపిలమ్, శంఖం, వైదూర్యం, జారుది, హంసమ్, ఋషభమ్, నాగం, కాలంజరం, నారదం మొదలైన ఇరవై పర్వతాలున్నాయి.)  ఇవి మేరు పర్వతానికి పూవు మధ్య చుట్టు ఉన్న పద్మ కర్ణికలాగ ఉన్నాయి. మేరు పర్వతం మధ్యభాగమైతే ఈ ఇరవై పర్వతాలూ చుట్టూ వ్యాపించి ఉంటాయి.

జఠరదేవ మేరు యొక్క పూర్వభాగములో ఉండి దశయోజన విస్తీర్ణముతో వ్యాపించి ఉంటాయి.  ఇలా చుట్టూ ఉన్న పర్వతాలతో మేరుపర్వతం అగ్ని జ్వాలలతో ఆవరించి ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది.

మేరు యొక్క మూర్ధ్న భాగములో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరముంటుంది. పదివేల యోజనాలతో సమ చతురస్రముగా ఉంటుంది. అది శాతకుంభీ నగరం.

ఇలాంటి బ్రహ్మ పురిని చుట్టుకొని అష్టదిగ్పాలకుల నగరాలుంటాయి.  ఏ దిక్కుకు ఏ పాలకులో ఆ దిక్కులో ఆ నగరాలుంటాయి.  ఒక్కో దానికీ రెండవది నాలగవ వంతు.  

బ్రహ్మదేవుని పట్టణము పేరు మనోవతి.  దీని చుట్టూ ఉన్న పట్టణాలను వివరిస్తాను చదవండి.  దేవేంద్రుని పట్టణము అమరావతి.  ఇది తూర్పు దిక్కున ఉంది.  అగ్నిదేవుడి పట్టణం తేజోవతి.  ఇది ఆగ్నేయదిక్కున ఉంది.  యముని పట్టణం సంయమని.  ఇది దక్షిణం వైపు ఉంది.  నిరుతి పట్టణం కృష్ణాంగన.  ఇది నైరుతి దిక్కున ఉంది.  వరుణుడి పట్టణం శ్రద్ధావతి.  ఇది పడమటి దిక్కున ఉంది.  వాయుదేవుని పట్టణం గంధవతి.  ఇది వాయువ్య దిక్కున ఉంది.  కుబేరుని పట్టణం మహోదయ.  ఇది ఉత్తర దిక్కున ఉంది.  ఈశానుడి పట్టణం యశోవతి.  ఇది ఈశాన్య దిక్కున ఉంది.
ఇలా మనకి శ్రీమద్ భాగవతం లో అన్ని నదులు, వనాలు చెట్లు, సముద్రాలూ మొ.. ఉన్నాయి..
మరల ఒక్కో చెట్టు ఒక్కో విశిష్టని సంతరించుకుని ఉంటాయి.. చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు -శాస్త్రం వివరించింది.
ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు..
https://ranisarma.blogspot.com/2020/07/blog-post_13.html?m=1
ఇటు
కృష్ణం వందే జగద్గురుం
శివ పరివారం 

Wednesday, July 22, 2020

ధ్రువుడు అనంతరం జరిగిన కథ

ప్రియమైన భాగవత శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి   నిన్నటి  రోజున ధ్రువోపాఖ్యానమ్ ను  మన గురువు గారు తెలియచేసారు.. ధ్రువుడు అనంతరం జరిగిన కథ మనం తెలుసుకుందాం ,మనకి శ్రీమద్ భాగవతం లో ఎందరో మహానుభావులు పేర్లు వస్తాయి. కనీసం వాళ్ళ పేర్లు తలుచుకున్న .. మనం ధన్యులు అని గురువు గారు మనకి చాల సార్లు చెప్పారు..


ఈ రోజు గురువు గారు చెప్పిన ప్రవచనం లో వచ్చిన వాళ్ళ పేర్లు

స్వయంభువ మనువుకు 'శతరూప'అనే భార్యవలన 'ప్రియవ్రతుడు' 'ఉత్తానపాదుడు' అనే కుమారులుజన్మించారు.వీరిలో ఉత్తాన పాదునికి 'సునీతి' 'సురుచి' అనే వారు భార్యలు.సురుచితో ఉత్తానపాదుడు అమిత ప్రేమగా ఉండేవాడు.సురుచికి 'ఉత్తముడు' సునీతీకి 'ధృవుడు' జన్మించారు.ఓకరోజు ఉత్తాన పాదుడు ఉత్తముని ఓడిలో కూర్చొపెట్టుకుని ఉండగా,అదేసమయంలో ధృవుడుకూడా తన తండ్రి ఓడిలో కూర్చోవాలని వెళ్ళాడు.అదిచూసిన సురుచి 'నీకు ఆ అధృష్టంలేదు వెళ్ళు' అని అన్నది.పినతల్లి మాటలకు మనసు గాయపడిన ధృవుడు తల్లి సునీతి అనుమతితో తపస్సుకు బయలుదేరగా నారదముని ఇచ్చిన సలహాతో యమునానది తీరాన ఉన్న 'మధువనం'చేరి నారదుడు ఉపదేశించిన నారాయణ మంత్రం జపిస్తూ,తపస్సు ప్రారంభించి తొలి మాసం ఆహారంగా వెలగ,రేగిపండ్లు స్వీకరిస్తు,రెండవ మాసం ఆరుదినాలకు ఒకసారి 'జీర్ణతృణపర్ణాలను'తింటూ తొమ్మిది దినాలకు ఒక సారి నీరు స్వీకరిస్తూ, మూడుమాసాలు గడిపాడు.నాల్గవమాసంలో పన్నెండు దినాలకు ఒకసారి శ్వాసిస్తూ,ఓంటి కాలిపై శ్రీమహవిష్ణువుని ధ్యానిస్తూ అయిదు మాసాలు తపసు చేసాడు.ధృవుని కి శ్రీమహావిష్ణువు దర్శనం ఇచ్చి'చిరంజీవి నీతపస్సు ఫలించింది.'జ్యోతిశ్చక్రము' నక్షత్రస్వరూపాలైన వసిష్ట,అత్రి,గౌతమ,కశ్యప,భరద్వాజ,జమదగ్ని,విశ్వామిత్రులు అయిన సప్తమహర్షులు తారకలతో కలసి దేనికి ప్రదక్షణం చేస్తుంటారో అటువంటి 'ధృవ' నక్షత్రంగా వెలుగొందుతావు.వృధ్ధుడైన నీతండ్రి రాజ్యాభారాన్ని నీవు స్వీకరించు.నీతమ్ముడు ఉత్తముడు అడవిలో వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతని తల్లి అడవిలో అగ్నిజ్వాలలకు బలి అవుతుంది'అని అదృశ్యమైయాడు. రాజ్యభారం స్వీకరించిన ధృవుడు శింశుమార ప్రజాపతి కుమార్తె 'భ్రమిరి'నివివాహంచేసుకున్నాడు.ఈమెకు 'కల్పుండు' 'వత్సరుడు'జన్మించారు.వాయుదేవుని పుత్రిక 'ఇల'ను చేపట్టగా ఆమెకు'ఉత్కలుడు'జన్మించాడు.'ధన్య'అనే భార్యకు'శిష్టుడు'జన్మించాడు. 'శంభువు'అనే భార్యకు 'భవ్యుడు' 'శ్లిష్టి'అనేవారు జన్మించారు.వీరుకాక 'గర్కుడు' 'వృషభుడు' 'వృకుడు' 'వృకలుడు' 'ధ్రతిమంతుడు'అనే కుమారులు ఉన్నారు. సుధీర్ఘ రాజ్యపాలన చేసిన అనంతరం తన సంతతికి రాజ్యాన్ని అప్పగించి ధృవతారగా అంబరాన నిలిచాడు ధృవుడు.ధృవుని పెద్దకుమారుడు ఉత్కలుడు రాజ్యాన్ని తిరస్కరించి తపోవనాలకు వెళ్ళడంతో,రెండోకుమారుడు వత్సరునికి పట్టాభిషేకంజరిగింది. వత్సరుడు 'సర్వార్ధి'ని వివాహంచేసుకున్నాడు.వీరికి 'పుష్పార్ణుడు' 'చంద్రకేతుడు' 'ఇష్టుడు' 'ఊర్జుడు' 'వసువు' 'జయుడు'అనేవారు జన్మించారు. వీరిలో పుష్పార్జునునకు 'ప్రభ' 'దోష' అనే ఇద్దరు భార్యలు.వీరిలో ప్రభకు 'ప్రాతర్శ' 'థంధని' 'సాయిలు'జన్మించగా,దోషకు'ప్రదోషుడు' 'నిశీధుడు' 'వ్యుష్టుడు'అనేవారు జన్మించారు.వీరిలో వ్యూష్టుని భార్య 'పుష్కరిణి'వీరికి 'సర్వతేజుడు'జన్మించాడు.అతనికి 'ఆకూతి'భార్య వీరికి'చక్షుస్సు'అనే మనువు జన్మించాడు.చక్షుస్సు భార్య 'నడ్వల' వీరికి'పురువు' 'కుత్సుడు' 'త్రితుడు' 'ద్యుమ్నుడు' 'సత్యవంతుడు' 'బుతుడు' 'త్రతుడు' అగ్నిప్టోముడు' 'అతిరాత్రుడు' 'సద్యుముడు' 'శిబి' 'ఊల్మకుడు'అనే వారు జన్మించారు.వీరిలో ఊల్మకుడికి 'అంగుడు' 'సుమనుడు' 'ఖ్యాతి' 'కత్రువు' 'అంగీరసుడు' 'గయుడు' జన్మించారు.అంగుడు 'సునీథ'దంపతులకు 'వేనుడు'జన్మించాడు.అతని ప్రవర్తన నచ్చక అంగుడు అడవులకువెళ్ళి తపస్సు చేసుకొసాగాడు.ఈవిషయం తెలుసుకున్న మునులు వేనుని శపించగా అతను మరణించాడు.మునులు అతని శరీరంనుండి నారాయణాంశంతో ఓబాలుని సృష్టించారు.అతని మొదటి చక్రవర్తి అయిన'పృథుడు'ఇతనిభార్య 'అర్చి' వీరు హరి నామ స్మరణతో పలు అశ్వమేథ యాగాలు చేసారు. పృథువుకు 'కుబేరుడు' బంగారు సింహాసనం.'వరుణుడు' చంద్రకాంతులు వెదజల్లే గొడుగు. 'వాయుదేవుడు' వింజామరం.'ధర్మదేవత' యశోరూపమైన పూమాల, 'ఇంద్రుడు'కిరీటం , 'యముడు'రాజదండం, 'బ్రహ్మదేవుడు'వేదకవచాలు, 'సరస్వతిదేవి'మేలిముత్యాలదండ,' విష్ణువు' సుదర్శన చక్రాన్ని, 'లక్ష్మిదేవి'తరగని సంపదను,'శివుడు' ఖడ్గాన్ని, 'పార్వతిదేవి'శతచంద్రం అనే డాలును,'చంద్రుడు'తెల్లని గుర్రాలను వెండి రధాన్ని,'సూర్యుడు' అస్త్రాలను,'అగ్ని' అజగవం అనేధనస్సును,'భూదేవి'యోగమాయ అయిన పాదుకలు బహుకరించారు.' ఈదంపతులకు'విజాతాశ్వుడు' 'థూమ్రాశ్వుడు' 'హర్యాశ్వుడు' 'ద్రవిణుడు' 'అంతర్ధానుడు' 'హవిర్భానుడు' 'వృకుడు' జన్మించారు.

ఇట్లు
శివ పరివారం 

Tuesday, July 14, 2020

శతగాయత్రి-మంత్రావళి

శతగాయత్రి-మంత్రావళి
-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //
-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//
-: దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//
-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//
-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//
-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//
-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//
-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//
-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//
-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//
-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//
-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//
-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//
-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//
-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//
-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//
-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//
-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//
-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//
-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//
-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//
-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//
-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//
-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//
-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//
-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//
శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//
శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//
శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//
శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

ఆది మంత్రం "గాయత్రి".

త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి. 
మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే // 
'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును.
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి".
యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
 'గయాన్  త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే  సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తియు గాయత్రీ శక్తిజనితములు. శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. 
గాయత్రీ తు స్వయం పూర్ణో యోగ ఇత్యుచ్చతే బుధై: / కించిత్తత్వం హి యోగస్య బహిరస్మాన్న విద్యతే //
భావం : గాయత్రి స్వయముగా పూర్ణయోగం అని పండితులు తెలియజేశారు. యోగం యొక్క ఏ తత్వాలు దీనికి బాహ్యముగా లేవు. యోగమనగా కలయిక. ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఒకొకరి సాధన ఓకోలా వుంటుంది. సాధకుని స్థితిబట్టి, అవగాహనబట్టి, అనుకూలతబట్టి, శక్తిబట్టి, యోగ్యతబట్టి తమకు నచ్చిన సాధనమార్గాన్ని అనుసరిస్తారు. ఏ సాధనైన దాని పరమార్ధం పరమాత్మలో సంలీనమే. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రీమాతకు ఐదు ముఖములుండును. అందు మొదటిది ముత్యపురంగు, రెండవది పగడపురంగు, మూడవది బంగారపు వన్నెయు, నాల్గవది ఇంద్రనీలపువర్ణమును, ఐదవది వజ్రపువర్ణమును కలిగియుండును. ఈమె త్రినేత్రదారిణి. నవరత్నకిరీటమును ధరించి ప్రకాశమానమై యుండును. దశబాహువులు కలిగి అందు వరదాభయముద్రలను, అంకుశం, కొరడా, కపాలం, శంఖ చక్ర గదా పద్మద్వయమును ధరించి ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును. 
                      * ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత *
గాయత్రి పరమాత్మ యొక్క ఇచ్చ్చాశక్తి. దాని కారణముగా సృష్టి మొత్తం నడుచుచున్నది. చిన్న పరమాణువు మొదలుకొని పూర్తి విశ్వబ్రహ్మాండం వరకు ఆమె యొక్క శక్తిప్రభావం వలననే చరిస్తున్నాయి. పరమాత్మ స్వయముగా మౌలికరూపంలో నిరాకారుడు, అన్నిటినీ తటస్థ భావముతో చూస్తూ శాంతియుత అవస్థలో ఉంటారు.సృష్టి ప్రారంభంలో ఆయనకు ఒకటి నుండి అనేకము అయే కోరిక కలిగినప్పుడు, ఆయన ఈకోరిక శక్తిగా తయారైనది.ఈ శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి తయారై నిలబడినది. సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. బ్రహ్మకు సృష్టినిర్మాణ, విస్తరణల కొరకు అవసరమైన జ్ఞానము, క్రియాకౌశలము ఆదిశక్తి గాయత్రి యొక్క తపోసాధన ద్వారానే లభించినది. ఇదే జ్ఞాన -విజ్ఞానము, వేదము అనబడినది. ఈ రూపంలో ఆదిశక్తి పేరు "వేదమాత" అయినది. వేదముల సారము గాయత్రీ మంత్రములో బీజ రూపంలో నిండి ఉన్నది. సృష్టి యొక్క వ్యవస్థను రక్షించే, నడిపించే విభిన్న దైవశక్తులు ఆదిశక్తి యొక్క ధారలే. ఆదిశక్తి నిర్మాణం, పర్యవేక్షణ, పరివర్తనము మొదలైన క్రియలకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దైవశక్తులరూపంలో విడివిడిగా ప్రకటితమౌతుంది. ఇదేవిధముగా ఇతర దైవశక్తులు దీనియొక్క వివిధ ధారలు ఈశక్తి నుంచే పోషణ పొందుతాయి . ఈ రూపములో శక్తిని  " దేవమాత " అనే పేరుతో పిలుస్తారు. విశ్వఉత్పతి మొత్తం ఆదిశక్తి గర్బములో జరిగినది . కనుక "విశ్వమాత" అనే పేరుతో కూడా పిలుస్తారు. 
                                      గాయత్రీ పరాశక్తి. మహాకాశ, చిత్తాకాశ, చిదాకాశ స్వరూపమే గాయత్రీస్వరూపం. గాయత్రిమంత్రం సర్వతత్త్వసంపూర్ణం. పరబ్రహ్మ మౌలికం. గాయత్రీ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరత్వమే భగత్వం. భగం కలిగినవాడే భగవంతుడు. భగమనగా బలం, తేజం, శక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యములని అర్ధం. ఈ దైవీశక్తులే గాయత్రీశక్తులు. శక్తిమంతుడే పరమేశ్వరుడు, శక్తి ఉత్పాదనమే గాయత్రీయోగం.
                                     గాయత్రి మూడు గుణములతో కూడిన శక్తి . హ్రీం - సద్బుద్ధి, శ్రీం - సమృద్ధి, క్లీం - శక్తి ప్రధానములు. దీనికి మూడు విశేష ధారలు కలవు. వీటిని గంగ, యమునా, సరస్వతిల త్రివేణీ సంగమం అని కుడా అనవచ్చును. దైవశక్తులతో జోడించినపుడు వీటిని సరస్వతి ,లక్ష్మి ,కాళి మరియు బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర రూపంలో తెలుసుకొనగలము. గాయత్రి సాధనతో సాధకుని మనస్సు, బుద్ధి మరియు భావనలు ఈ త్రివేణిలో స్నానం చేసే అవకాశం లభించినపుడు, స్థితి కాయకల్పం వలె తయారవుతుంది. సద్గుణములు వృద్ధి, అంతర్గత శాంతి , సంతోషంతో పాటు సార్వజనిక సమృద్ధి సఫలతలను ఇచ్చేది గాయత్రి. 
                                     ప్రాపంచిక కష్టాల నదిని దాటుటకు ధైర్యము, సాహసము, ప్రతిభ, ప్రయత్నం అనే నాలుగు కోణములుగల నావ అవసరము. గాయత్రీ సాధన ఈ నాలుగు ప్రత్యేకతలను మనిషిలో బాగా పెంపొందిస్తుంది.
                                     జీవాత్మ ,పరమాత్మ మధ్య సూక్ష్మ ప్రకృతి యొక్క మాయా పరద ఉన్నది . ఈ పరదాను దాటుటకు ప్రకృతిసాదనములతోనే ప్రయత్నించాలి. చింతన - మననం, ధ్యానం - ప్రార్ధన, వ్రతము - అనుష్టానము, సాధన వంటి అన్ని ఆద్యాత్మిక ఉపచారములు ఇందు నిమితమై ఉన్నాయి. వీటన్నిటిని వదిలి పరమాత్మను పొందుట ఏ విధముగాను వీలుకాదు. సత్యగుణం, చిత్ శక్తి ద్వారా మాత్రమే జీవాత్మ ,పరమాత్మల యొక్క కలయిక జరుగగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మల కలయికను జరుపగలిగే శక్తియే గాయత్రి.
                                    గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి  24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి. 
ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందలి జీవాత్మ చిదానందస్వరూపముగా పంచప్రాణస్వరూపముగా విహరించుచున్నది. తన్మాత్ర స్వభావంవలన ప్రలోభితమైన గుణసంపత్తును దైవీసంపత్తుగా మలచుకొని ఆధ్యాత్మికధారణ చేయవలెను. యోగసిద్ధివలన ఇది సాధ్యం. యోగసిద్ధి మంత్రసిద్ధివలన వచ్చును. 
                                * గాయత్రీ మంత్రం *
గాయత్రీమంత్రములో తొమ్మిది నామములు కలవు. ౧. ఓం ౨. భూ ౩. భువః ౪.సువః ౫.తత్ ౬. సవితు: ౭. వరేణ్యం ౮. భర్గః ౯.దేవస్య ఈ తొమ్మిదినామములద్వార భగవంతుడు కీర్తింపబడుతున్నాడు. ధీమహీ అంటే ఉపాసన అని అర్ధం. ధియోయోనః ప్రచోదయాత్ అంటే భగవంతున్ని ప్రార్ధించుట.
ఈ మంత్రమును ఐదుచోట్ల ఆపి జపించవలెను. ౧. ఓం ౨. భూర్భువ స్సువః ౩. తత్స వితుర్వరేణ్యం ౪. భర్గోదేవస్య ధీమహీ ౫. ధియోయోనః ప్రచోదయాత్.
"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అర్ధం : 'ఓం' కారంను ప్రణవమని అందురు. ప్రణవమునుండియే సమస్త శబ్దములు, మంత్రములు ఏర్పడుటచేత ఓంకారం సర్వమంత్రములకు హేతువు. ఓంకారముచే వ్యాహృతులు, వ్యాహృతులచే వేదములు ఆవిర్భవించినవి. (ఓంకారం వివరణ ఈ బ్లాగ్ మొదటి పోస్ట్ యందు కలదు)   ఓం = ప్రణవాత్మకమైన పరమాత్మ(పరమేశ్వరుడు), భూ = ప్రాణము నకు ప్రాణము(సత్ స్వరూపుడు), భువః = సర్వదుఃఖములను పోగొట్టి(చిత్ స్వరూపుడు), సువః = సమస్తసుఖములను యిచ్చునట్టి(ఆనందస్వరూపుడు)పరమాత్మ, నః = మా యొక్క, ధియ = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరణ చేయునో,  తత్ = ఆ, సవితు: = సర్వజగత్తులను సృష్టిచేయు, దేవస్య = దివ్యమహిమగల ఆ పరమాత్మయొక్క, వరేణ్యం =మిక్కిలి శ్రేష్టమై కోరదగిన, భర్గః = సర్వదుఃఖనాశకరమగు శుద్ధస్వరూపమును, ధీమహి = ధారణచేయుదునుగాక.                               
                              * గాయత్రీ గుణముల విశిష్టత *
ఈ మంత్రము యొక్క ఇరువదినాలుగు అక్షరములు ఇరువదినాలుగు గుణములను కలిగియున్నది.
'త' - అజ్ఞానాంధకారమును పోగొట్టును, 'త్స' - ఉపపాతకములను పోగొట్టును, 'వి' - మహాపాతకములను, 'తు' - దుష్టగ్రహ దోషములను,   'ర్వ' - భ్రూణహత్యాదోషములను, 'రే' - అగమ్యాగమనదోషములను, 'ణి' - అభక్ష్యాభక్షణ దోషములను, 
'యం' - బ్రహ్మహత్యాపాతకములను, 'భ' పురుషహత్యాపాతకములను, 'ర్గో' గోహత్యదోషములను, 'దే' స్త్రీహత్యాదోషములను, 
'వ' - గురుహత్యాదోషములను, 'స్య' - మానసికపాపములను, 'ధీ' - పితృ మాతృవధ పాపములను, 'మ' - పూర్వజన్మార్జిత పాపములను, 'హి' - అశేష పాపసమూహములను, 'ధీ' - ప్రాణివధపాపములను, 'యో' - ప్రతిగ్రహపాపములను, 'యో' - సర్వపాపములను పోగొట్టగా,
'నః' - ఈశ్వరప్రాప్తియు, 'ప్ర' - విష్ణులోకప్రాప్తియు, 'చో' - రుద్రపదప్రాప్తియు, 'ద' - బ్రహ్మపదప్రాప్తియు, 'యాత్' - త్రిమూర్తుల ప్రసాదసిద్ధిని కలగజేయును.
భూ:, భువః, సువః, అనే మూడు వ్యాహృతులు బ్రహ్మతత్వ స్వరూపలక్షణమైన సత్, చిత్, ఆనందాలు. భూ: అంటే సత్తు, భువః అంటే చిత్తు, సువః అంటే ఆనందము. ఈ మూడు కలిసిందే ఓం. ఇదే పరబ్రహ్మ. తత్ సవితు: అదే సవిత. సూయతే అనే నేతిసవితా - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత (గాయత్రి). 
                     * గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం * 
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.
సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు

గాయత్రి అంటే…
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
*************************************************************************************************************
గాయత్రి జపము వలన కలుగు ప్రయోజనాలు
గాయత్రీ మంత్రం చాలా గొప్పది. దాని ప్రభావం అనంతం. పూర్వం ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని హోమాలు చేసి రోగాల్ని పోగొట్టుకున్నారని దేవీ భాగవతం వివరిస్తోంది. ఈ మంత్ర, జప, హోమ విధానాల్ని బాగా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. మంత్రం ఇంత శక్తిమంతమైనది కనుకనే ఈనాటికీ చాలా చోట్ల దీని మహత్వం ప్రచారంలో వినిపిస్తోంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం వల్ల చేకూరే ప్రయోజనాల్ని దేవీ భాగవతం పదకొండో స్కంధంలో వివరించి చెప్పాడు.
రావిచెట్టు కింద శనివారం కూర్చొని నూరుసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే భూత రోగ అభిచారాల నుంచి విముక్తి లభిస్తుంది. తిప్పతీగ ముక్కలు పాలలో నానపెట్టి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయహోమం అవుతుంది. ఇలా చేయటం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటం కోసం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానపెట్టి అగ్నిలో వ్రేల్చితే (హోమం చేస్తే) క్షయరోగం తగ్గుతుంది.
పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటినీ కలిపి గాయత్రీ మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. క్షీరాన్నాన్ని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇచ్చి, సూర్యుడికి నివేదించి దాన్ని రాజయక్ష్మ రోగికి తినిపిస్తే బాధ తగ్గుతుంది. సోమలతను కణుపుల వరకూ తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. శంఖవృక్షపు పూలను గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వ్రేల్చితే కుష్టురోగం తొలగుతుంది. పాలచెట్టు సమిధలతో హోమం చేస్తే ఉన్మాదం తగ్గుతుంది. మేడిచెట్టు సమిధలను గాయత్రీ మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరకురసం, తేనె కలిపి హోమం చేసినా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మసూచి రోగం మటుమాయమవుతుంది.
కపిలగోవు నెయ్యిని వ్రేల్చినా మసూచి తొలగిపోతుంది. మేడి, మర్రి, రావి సమిధలను వ్రేల్చితే ఆవులు, గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిధలను పాలు, నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రీ మంత్రంతో హవనం చేస్తే చీమలు తదితరాల వల్ల కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టిపెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్నిభయం, గాలిభయం, దొంగలభయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూతరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రీ మంత్ర జలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూత శాంతికి నూరుసార్లు గాయత్రీ మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
గాయత్రీ మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి, కలివి కలుగుతాయి. ఎర్ర కమలాలను గాయత్రీ మంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. అన్నాన్ని హోమం చేసినా సంపదలు కలుగుతాయి. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడు వేళ్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తులతూగుతుంటాయి. మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు రెండు వందల సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రీ మంత్ర హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రీ మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. ఈ జపం ఎలా ఎన్నిసార్లు ఏయే నియమ నిష్టలతో చేయాలనే విషయాన్ని పండితుల నుంచి తెలుసుకొని అలా చేయటం ఉత్తమం.

Monday, July 13, 2020

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు -శాస్త్రం

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు భాగవతం లో గురువు గారు చెట్లు మొక్కలు వాటి వివరణ చెప్పారు

పచ్చదనం, పరిశుభ్రం అంటూ మొక్కలు పెంచడం గురించి, వృక్షాల వల్ల ఉపయోగాల గురించి ఇటీవలికాలంలో ఊదరగొట్టేస్తున్నారు. కానీ, వృక్షాల గొప్పదనం గురించి బమ్మెర పోతన గారు  ఏనాడో భాగవతంలోనే చెప్పారు. బృందావనంలో గోపకులు గోవుల్ని మేపుతూ అలసిపోయి దట్టంగా ఉన్న చెట్ల నీడలకు చేరతారు. ఆ సందర్భంలో వారు బలరామకృష్ణులనుద్దేశించి చెప్పిన పద్యమిది..

‘‘అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబు నందుండు, నా
తప శీతానిల వర్ష వారకములై, త్వగ్గంధ నిర్యా సభ
స్మపలా శాగ్ర మరంద మూల కుసుమచ్ఛాయా ఫలశ్రేణి చే
నుపకారంబులు సేయునెల్లరకు నీ యుర్వీజముల్‌ గంటిరే?’’

ఈ చెట్లకున్న 16 సుగుణాల గురించి చెప్పే పద్యమిది. అవేంటంటే.. చెట్లు ఎవరికీ అపకారం చేయవట. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం చేయకుంటే అదే పదివేలు. ఈ యుగానికి ఇదే గొప్ప లక్షణం. చెట్లు ఏకాంతంగా ఉండగలుగుతాయట. ఏకాంతంగా ఉండగలిగినప్పుడే మనం ఎవ్వరమో ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఇవి మనుషులకు ఆదర్శం. అలాగే.. చెట్లు ఎండ నుంచి, చలిగాలి నుంచి రక్షిస్తాయి. మర్రిచెట్టు వంటివాటి నీడలు ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయని శాస్త్రం. వర్షంలో తడిసిపోకుండా దట్టమైన చెట్లు కాపాడతాయి. చెట్లపై తోలు వస్త్రాలకు, తాళ్లకు వాడతారు (త్వక్‌). వాటి సుగంధం గాలిని ఆరోగ్యకరంగా చేస్తుంది (గంధ). వాటి జిగురు కూడా ఉపయోగపడుతుంది (నిర్యాస).

వాటి బూడిదను వైద్యంలో ఉపయోగిస్తారు (భస్మ). వాటి ఆకుల పచ్చదనంతో పర్యావరణం మొత్తం ప్రాణవాయుమయం అవుతుంది(పలాశ). వాటి చిగుళ్లు కూరల్లో, పచ్చళ్లలో వాడతారు (అగ్ర). పూలలో ఉండే తేనె ఉపయోగం మందుల్లో ఎంతో ఉంది (మరంద). వాటి వేళ్లు ఆహారంగా, వైద్యంలో ఉపయోగపడతాయి(మూల). పూలు పూజకు ప్రశస్తం, శిరోధార్యం (కుసుమ). వాటి నీడ తాపోపశమనం (ఛాయా). వాటి ఫలాలు పుష్టికరమైన ఆహారం (ఫలశ్రేణి). ఇలా 16 ఉపయోగాలను ఒకే పద్యంలో నాలుగు పంక్తుల్లో పోతన తెలియజేశాడు. ఇంత చక్కని పద్యాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టకపోవడం వల్ల ఎంత కోల్పోతున్నాం?
ఇలాంటి పద్యాలూ కనీసం ఉద్యాన వనం లో పెట్టి వాటి వివరణ పెడితే బాగుంటుందని మా శివ పరివారం అభిప్రాయం

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనకి శాస్త్రం తెలియచేస్తోంది 

మన చుట్టూ ఉంటూ వాటి ఉనికి తో మనకి అన్నివిధాల మేలు చేస్తున్న వృక్షాలు చాలానే ఉన్నాయి. పరిసరాల శుద్ది కోసం, వాతావరణ నైర్మల్యం కోసం, ప్రాణ వాయు సంచారం వల్ల అనేక జీవ కోటి బ్రతకడం కోసం వృక్షాలు చెట్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఫల పుష్పాలతో కూడిన చెట్లతో, కంటికి ఇంపుగా ఆహ్లాదం గా వనాలు ఉన్న చోట దేవతలుఉంటారు, ఇటువంటి ప్రదేశాలు వారికి ప్రీతికరమై కొలువుతీరుతారు. దైవ సంబంధితమైన వృక్షాలను కాపాడుతూ, వాటి ని పూజించడం ద్వారా ఎంతో మేలు జరగడమే కాకుండా, గ్రహాల వలన కలిగే దోషాలు కూడా నివారింపబడతాయి.

అగ్ని హోత్రం నిర్వహించడం కంటే, పుత్రుడిని కనడం కంటే, బాటలో నీడనిచ్చు మహా వృక్షాలను నాటడం పుణ్యకరమని భావిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. చెట్లు ఇహలోకం లో పరలోకం లో సుఖానిచ్చే సత్పుత్రుల తో సమానమని, దేవ, నాగ, గంధర్వ, కిన్నెర, రాక్షసులకు నిలయమై రాబోవు పితృదేవతలను తృప్తి  పరుస్తాయని చెప్పబడింది.

చెట్లకు బాధను కలిగిస్తే, అంటే నరకడం, కొట్టడం చేస్తే మహాపాపమని, ముఖ్యం గా మర్రి, రావి, చందనం చెట్లను నరికితే బ్రహ్మహత్య తో సమానమని, మూలాన్ని నరికివేస్తే వంశక్షయమని, చెట్లను కొట్టినవాడు రాబోవు జన్మలో మూగవాడుగా, అనేక శారీరిక, మానసిక రోగగ్రస్తుడిగా పుడతాడని భవిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.

నదీ తీరాల్లో వృక్షాలను నాటడం ద్వారా పితృదేవతలకు తృప్తి కలుగుతుందని పద్మపురాణ వచనం. ప్రతి పర్వం లో వాటి ఆకులు పడితే అవి పిత్రుదేవతలకు పిండాలని సృష్టి ఖండం ద్వారా తెలుస్తుంది.

మార్గాల గుండా, దేవాలయాల్లో ను చెట్లను నాటడం వలన కీర్తి లభిస్తుందని చెప్పబడింది.

మఱ్ఱిచెట్టు శివరూపతత్వం అని స్కాందపురాణం ద్వారా తెలుస్తుంది.

తులసి మొక్క సర్వపాపహరమనీ దీనితో సాటి వచ్చునది ఏది లేకపోవడం వలన దీని పేరు సార్ధకమని, పాపాలకు అగ్నిశిఖ వంటిదని ముక్తిని ప్రసాదిన్చేదని, శ్రీ మహావిష్ణువు భక్తీ నోసంగునదని దేవి భాగవతం లో తులసి యొక్క పవిత్రతను చెప్పబడింది. తులసి మొక్కకి ఎన్నో ఆరోగ్య గుణాలు, దైవిక గుణాలు ఉన్నాయి. ఇంట్లో ఉత్తరం వైపు తులసి చెట్లని ఉంచడం వలన వాస్తురీత్యా ఎంతో ఉపకరిస్తుందని చెప్పవచ్చు.

బిల్వ వృక్షం గురించి ఋగ్వేద, యజుర్వేదాలలో ప్రస్తావన చేయబడింది. శివునికి ఎంతో ప్రీతికరమైన వృక్షం. ఈ చెట్టు కి 365 రోజులు పండ్లు ఉంటాయి. ఈ పండ్లని లక్ష్మి ఫలమని లేక శ్రీ ఫలమని అంటారు.

రావి చెట్టు ప్రకృతి లోని పావన వృక్షాలలో ఒకటైనది. పురాణాలలో రావి చెట్టు యొక్క విశిష్టత గురించి అనేక విధములుగా ప్రస్తావించ బడింది. రావి చెట్టుని విష్ణు స్వరూపం గా పూజిస్తారు. అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది మూర్తి దాల్చిన విష్ణు స్వరూపం. మహాత్ములు దీనిని పుణ్య మూలమని సేవిస్తారు. దీనిని ఆశ్రయించడం వలన అభీష్ట సిద్ది కలగడమే గాక, పాప నాశనం కలుగుతుంది.

వాతావరణ కాలుష్యం, రోగకారక కీటకాలను నాశనం చేసే వృక్షం కనుక దీనిని దేవతా వృక్షం గా భావిస్తారు. ధార్మిక విశ్వాసం  గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు. ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మ హత్య తో సమానం అని భావిస్తారు. వైజ్ఞానిక పరం గా రావిచెట్టు నిరంతర ప్రాణ వాయువుని వెలువరించే ఏకైక అధ్బుత వృక్షం. దీని సమీపం లో ఉండటం వల్ల ప్రాణ శక్తి వృద్ది చెందుతుంది.

అరటి చెట్టు ని విష్ణు మూర్తి కి ప్రతీకగా చెప్పబడింది. గురు గ్రహ ప్రీతి కొరకు గురువారం రోజున అరటి చెట్టుని పూజిస్తారు. కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎన్నో ఉత్తమ కార్యాలకు వీటి ఆకులను పలు సందర్బాలలో వాడుతారు.

మామిడి చెట్టు ని యజ్ఞ యాగాదులలో లోను, ప్రతి శుభకార్యాలలోను వీటిని వాడుతారు. దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఈ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. ఇంటి ద్వారానికి వీటి ఆకులని కట్టడం ద్వారా ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మామిడి చెట్టు ఇంట్లో ఉంటే జ్ఞానం, ప్రశాంతత , మరియు అదృష్టం వృద్ది చెందుతాయని చెప్పబడింది.

వేప చెట్టు లక్ష్మీ స్వరూపం గా చెప్తారు. ఈ చెట్టు ని సాక్షాత్తు అమ్మవారి రూపం గా పూజించి ఆరాదిస్తారు. అధ్బుతమైన ఔషదగుణాలు కలిగిన ఈ వృక్షాన్ని చాలా  ఇళ్ళలో చూడవచ్చు. చర్మ, ఉదర, చిగుళ్ళు వంటి ఎన్నో సమస్యలకు ఉపకరిస్తుంది. ఈ వృక్షం ఇంట్లో ఉండడం ఆరోగ్యం తో పాటు సకల శుభాలు కలుగుతాయి.

అత్తి  చెట్టు ని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రతీకగా చెప్పబడింది. వీటి పండ్లని చాలా  ఔషదాలలో వాడుతారు. ఈ చెట్టు ని పూజించడం వలన కుజ గ్రహం వలన కలిగే సమస్యలు తగ్గుతాయి. గ్రహాల పీడలనుండి ఉపసమనం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్న వారు ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానించి పూజించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. అవివాహితులు ఈ చెట్టు ని పూజించడం ద్వారా శీఘ్ర వివాహానికి కి కూడా అవకాశం కలదు.

ఉసిరిగ చెట్టు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పూజించటం వలన గ్రహ బాధలు బూత ప్రేతాది బాధలు తొలగుతాయి. శరదృతువు లో ఉసిరి చెట్టుని పూజించి ప్రదక్షిణాలు చేయడం వల్ల  శరీర రుగ్మతలు సమసిపోతాయి. బుద్ది కుశలత వృద్ధి చెందుతుంది. ఉసిరిక చూర్ణం, రసం శరీరానికి లేపనం వేసి స్నానం చేయడం వల్ల శరీర సౌందర్యం కాపాడబడుతుంది. చర్మం కోమలంగా మారుతుంది చలి నుండి రక్షణ కలుగుతుంది. ఈ చెట్టు ని పూజించి దాని కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ చెట్టు గాలిని పీల్చడం వల్ల పైత్యప్రకోపం శమించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.

అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. పురాణాల ఆధారం గా యక్షులు ఈ చెట్టు పైన నివాసం ఉంటారని తెలుస్తుంది. అందువలన ఈ చెట్టు కింద ఏ దైవకార్యం చేసినా వెంటనే మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ గర్భ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కొన్ని రకాల మందుల తయారీ లో  అశోక చెట్టు ఆకులను వినియోగిస్తారు. ఆర్ధిక సమస్యలు, ఆలస్య వివాహ సమస్యలు , కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దైవ కార్యాలైనా ఈ చెట్టు కింద చేయడం వలన ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ఇట్లు 
శివ పరివారం 

Monday, July 6, 2020

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం- శ్రీమద్ భాగవతం లో కథలు


ప్రియమైన భాగవత శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ 

గురువు గారు మనకి భాగవత ప్రవచనం లో అగస్యులు మహా ముని గురించి చెబుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం  అని ఎలా వచ్చిందో తెలియచేసారు 

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..! ఇది చాలా మంది వినే ఉంటారు . .

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’: అని మన ఇళ్ళల్లో పిల్లలకు గనుక కడుపులో నొప్పి వస్తోంటే, వారి పొట్టపై అరచేతితో రాస్తూ, "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.." అంటూ మంత్రం అనడం మనకు అలవాటు.

ఆహారం జీర్ణం కానట్లు అనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇలా స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకీ ''జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..'' అనే నానుడి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ, సుతీష్ణుడు అనే ఋషి ద్వారా, అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ తెలుసుకుంటాడు..

సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకుతూ వెళుతుంటే వారికి ఒక పెద్ద బూడిద రాశి, ఎముకల గుట్ట కనిపిస్తాయి. అప్పుడు రాముడు..సీతా లక్ష్మణులతో గతంలో ఆక్కడ జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు.

ఇప్పుడు దాని కధ తెలుసుకుందాము

ఇల్వలుడు, వాతాపి అను ఇద్దరు రాక్షసులుండేవారు. వారిద్దరు బ్రాహ్మణ వేషాలు వేసుకొని దారిన పోయే పండితులను, వేదాధ్యయన పరులను భోజనానికి పిలిచేవారు. అతిథి పూజ చేస్తేగాని మేము భోజనం చేయమనే నిబంధన మాకు పెట్టుకున్నాము. రండి రండి అని పిలిచేవాళ్లు. వీళ్లు చెప్పేది నిజమనుకొని బాటసారులు భోజనానికి వచ్చేవారు. (అపుడు అంతా నడుచుకొంటూ వెళ్లేవారుకదా ) అలా వచ్చిన వారికి వాతాపిని ఇల్వలుడు ఆహార పదార్థంగా తయారు చేసి వారికి వడ్డించేవారట. వారు తిని భుక్తాయాసం తీర్చుకోవడానికి కాసేపు అరుగు పైన కూర్చునేసరికి ‘వాతాపి, వాతాపి! ఇలా బయటకు రా’ అని ఇల్వలుడు పిలిచేవాడట. వాతాపి ఆ తిన్నవారి కడుపు చీల్చుకుని బయటకు వచ్చేశేవాడట. దాంతో ఆహారం తిన్నవారు చనిపోయేవారు.

ఇక ఏముంది ? హాయిగా ఇద్దరూ ఆ మనిషిని తినేసేవారట. ఇట్లా వీరి ఆగడాలు మరీ శ్రుతిమించి పోయాయి. బాటసారులు అటు వెళ్లాలంటే భయపడిపోయేవారట. దాంతో వారంతా వచ్చి అగస్త్యునికి తమ బాధను చెప్పుకున్నారు. ఆయన కూడా వాతాపి, ఇల్వలుల దగ్గరకు వెళ్లాడు. ఆ మహర్షిని వీరు భోజనానికి పిలిచారు. భోజనం పెట్టారు.
కాని అగస్త్యుడు భోజనం తినగానే తన పొట్టను తడుముకొంటూ జీర్ణం జీర్ణం వాతాపి అన్నాడట. అంతే అక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు.

ఇల్వలుడు ఎప్పటిలాగే ‘వాతాపి బయటకు రా’అని పిలిచాడట. మహర్షి ‘ఇల్వలా! ఇంకెక్కడ వాతాపి వాడు నా పొట్టలో జీర్ణమైపోయాడు..ఇక నీవంతు’అన్నాడట. దాంతో వీనికి బుద్ధి వచ్చింది. మహర్షి కాళ్లావేళ్లా పడ్డాడు.

అదిగో అప్పట్నుంచే మన పెద్దలు చిన్న చిన్న పిల్లలకు ఉగ్గు పెట్టినప్పటినుంచి ఏం పెట్టినా వారు తిన్నవెంటనే ఇలా అంటారు.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుఱ్ఱాల్ తిన్న గుగ్గిళ్లరిగి
ఏనుగుల్ తిన్న వెలక్కాయలరికిగి
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి
భీముడు త్ని పిండి వంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ రుూ బిడ్డను సంజీవ రాయా! అనేవారు. 

చూశారా వాతాపి జీర్ణం వెనుక ఎంత కథ ఉందో ...

ఇట్లు 
శివపరివారం 

Sunday, July 5, 2020

కశ్యపుని వంశవృక్షం

DATE : 07/05/2020

ఈ రోజు భాగవత ప్రవచనం లో మన గురువు గారు కశ్యపు మహర్షి వంశము గురించి వివరించారు..
ఆ వంశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఒక్క వంశం తెలుసుకుంటే మన వంశాభివృద్ధి బాగుంటుంది అని గురువు గారు తెలియచేసారు

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.

ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు .

వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.

పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు.  ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు.

వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.

కశ్యపుని వంశవృక్షం

కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది.
కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.
కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.

భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.

ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు.శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-

దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు.

  కశ్యప సంతానం  

కశ్యపుడు తన వివిధ భార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:

LIST


  • దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు.
  • అదితికి పుట్టినవారు దేవతలు, ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి.
  • దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే.
  • సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.
  • క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు.
  • వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.
  • కద్రువకు జన్మించినవారు నాగులు.
  • మనుకు జన్మించిన వారు మానవులు.

అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి
1. దితి    2. అదితి  3. దను   4. కష్ట     5.అరిష్ట     6. సురస  7. ఇళ   8. ముని   9. క్రోధావసు 10. తమ్ర    11. సురభి 12. సరమ    13. తిమి అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం.


  • తిమి వల్ల జన్మించినవి జలచరాలు,  
  • సరమ వల్ల భయంకరమైన జంతువులు,
  • సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు,
  • తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు,
  • ముని వల్ల దేవతలు, అప్సరలు,
  • క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు,
  • ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు,
  • సురస వల్ల చెడు ఆత్మలు,
  • అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ),
  • విశ్వ వల్ల యక్షులు,
  • దితి వల్ల 49 మంది వాయుదేవులు,

అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు.
మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.
అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.

వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.

వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు

వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి.

కాశ్యప గోత్రము

హిందూ సమాజములో సంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును. అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను.

శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే | ; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించారు అని శ్రుతివాక్యము.



ఇట్లు

శివ పరివారం