ధన్వంతరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది.
మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చు.
శ్రీ ధన్వంతరి స్తోత్రం..
శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః ౹
సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ ౹
కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ ౹
వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ౹౹
ఒక శంఖం, ఒక చక్రం లేదా శక్తి (చక్ర) పళ్లెంలో ఒక జలగ మరియు అమృతాన్ని (ఖగోళ అమృతం) ఒక కుండ: హిమ్, తన నాలుగు చేతులు పట్టుకుని ఎవరు ధన్వంతరి, నమస్కారాలు. దీని గుండె కాంతి చాలా సూక్ష్మ స్పష్టమైన, సున్నితమైన మరియు ఆనందము మెరుపు ప్రకాశిస్తాడు. ఈ కాంతి కూడా అతని తల మరియు తామర కళ్ళు చుట్టూ మెరిసిపోయాడు. ఎవరు తన మేరే నాటకం ద్వారా ఒక శక్తివంతమైన దావాగ్ని వంటి అన్ని వ్యాధులు నాశనం చేస్తాడు.
ఇప్పటిదా..అప్పటిదా.. అని కాకుండా
నీ కోసం నా కోసం ముందే ఆలోచించి
యుగాలకు మునుపే ఉద్భవించిన ధన్వంతరి.. మహా మంత్రం
అలా దశావతారాలకు మునుపే తొలి అవతారమెత్తిన శ్రీ హరి!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ సూత్రానికి జీవం పోస్తూ
సృష్టిలో ఆది వైద్యుడిగా రూపు దాల్చిన ధన్వంతరి..
అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ రోగాలకు వైరి...!
శ్రీ హరి రక్ష మనకి
వైద్యో నారాయణో హరి.. ధన్వంతరి పేరు చెబితేనే
వ్యాధులు హరీ.. అలా వరమిచ్చెను మురారి..
సర్వరోగాలను హరియించే భాస్కరుని శిష్యుడై..
బ్రహ్మాదులే ధన్వంతరి అని నామకరణం చేయగా
ఇలను చేరిన మొదటి వైద్యుడు.. శస్త్రచికిత్సలకూ ఆద్యుడు!
మన మనసుకు..శరీరానికి బాధ కలిగించే శల్యాలను..
వికృతులు..అఘాతాలను నివారించే శక్తిసంపన్నుడు
ఈ ధన్వంతరుడు..! ఇది వ్యుత్పత్తి..లోకోక్తి..
అనేక సందేహాలకు నివృత్తి..!!
క్షీరసాగర మథనం జరుగుతున్న శుభవేళ..
కామధేనువు..ఉచ్చశ్రైవం. ఐరావతం..పారిజాతం..
ఇన్ని అద్భుతాలు.. అనంతరం ముకుందప్రియ..
మహాద్భుత ఉద్భవం తదుపరి.. అసురులు అక్షింతలు చేసుకుని వీక్షిస్తుండగా..
అసలే మూతపడని రెప్పలను మరింతగా తెరచి చూస్తుండగా..
పీనాయుత బాహుదండ యుగళుడై..
కంబుకంటుడై.. పద్మారుణ లోచనుడై..
విశాల వక్షస్థలుడై.. సుస్నిగ్ధ కేశజాలంతో..
నీలగాత్ర తేజుడై.. పీతాంబరం..మణికుండల
సమాభాసితుడై.. అమృతకలశంతో అరుదెంచినాడు ధన్వంతరి..
లోకకళ్యాణం కోరి..!
ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.[1]
భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు.
పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడు అతడే "ధన్వంతరి" గా ఉద్భవించాడు
ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
గాయత్రీ :
ఓం తత్ పురుషాయ విద్మహే అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!
ఓం ఆదివైధ్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!
క్షీర సాగరమును చేరి సురాసురు
,,,,లమృతమ్ము నొందగ యత్నమూని
మంథర శైలమున్ మంచి కవ్వము చేసి
....వాసుకిన్ ద్రాడుగ బట్టుకొనుచు
ద్రిప్పుచు నుండగా దీక్షతో నా గిరి
....క్రుంగుచుండుట జూచి కూర్మమగుచు
వీపుపై మోసెను విష్ణువా యద్రిని
....సాధన మారీతి జరుగు చుండ
నహిపతికి బాధ హెచ్చయి హాలహలము
గ్రక్కె గ్రక్కున నతి భయంకరముగ నది
సకల ప్రాణాంతకంబయి జగములెల్ల
వ్యాప్తి చెందుచు నుండగా భయమునొంది
దేవతలు రాక్షసులు నంత దేవదేవు
డైన శంకరు బ్రార్థింప నా కృపాబ్ధి
యభయమిడి స్వాగతించి యా హాలహలము
నంతయును దన కంఠంబునందు నిలిపె
ఆ మహా గరళమ్ము నంతయు మ్రింగెనా
....కడుపులో నున్న లోకమ్ము లెల్ల
నాశనమగునంచు నీశుడా తరుణాన
....నుమియుచో వెలుపల నుండునట్టి
భువనమ్ము లెల్లను పూర్తిగా నాశిల్లు
....ననుచు దలంచి నిల్పెను స్థిరముగ
తన కంఠమందు తద్దయు హాలహలమునే
....యెంత బాధయును భరించుచుండి
యటుల ముల్లోకములకు మహావిపత్తు
తొలగజేసి భద్రమ్ములు కలుగజేసె
నాదిదేవుడు నతుల దయామయుండు
శంకరుండు సదా లోకశంకరుండు
జయ మహాదేవ! శంకరా! జయము జయము
జయ జగత్త్రయ రక్షకా! జయము జయము
జయ మనుచు దేవ దానవ చయములెల్ల
సంస్తుతు లొనర్చి రావేళ సన్నయమున
మరల క్షీరాంబుధి మథనమ్ము సాగించు
....చుండగా నద్దాని నుండి వేగ
వెల్వడె సురభియు, విధుడు,నైరావత
....మును కల్పభూజమ్ము, పుష్కరాక్షి
యగు మహాలక్ష్మియు, నశ్వరాజంబగు
....నుచ్చైశ్రవమ్మును నొప్పు మీర
అమృత కలశమ్ముతో నంత ధన్వంతరి
....ప్రత్యక్షమయ్యె నా పర్వమందు
హరి జగన్మోహినీ రూప మపుడు దాల్చి
యమృతకలశమ్ము చేబూని యసురతతుల
నకట మోహింపజేయుచు, నమర బృంద
ములకు నమృతమ్ము బంచె నద్భుతము గాగ
హరి లీలలు హరు లీలలు
కరము శుభంకరములగు జగమ్ములకెల్లన్
హరిహరుల నాత్మ దలచుచు
పరమాదరమలర గూర్తు వందన శతముల్
No comments:
Post a Comment