Saturday, July 17, 2021

దశమ స్కంధము - ఉత్తర భాగం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

గత 16 నెలలు నుంచి మనకి గంగా ప్రవాహం లా జరిగియే శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ఘట్టం ఈ రోజు అష్టమి తిధి కి దశమ స్కంధం లో ఉన్న ఉత్తర భాగం పరిపూర్ణమైనది..ఎందుకో తెలియదు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి . అప్పుడే భాగవతం అయిపోతోందా అని..

ఆ శ్రీకృష్ణ పరమాత్మా దయవలన ఇప్పటి వరకు ఎన్ని ఆటకంకాలు వచ్చినా , మన పూజ్య గురువు గారు భాగవతం ను లోక కళ్యణమ్ కోసం , కరోనా నివారణార్ధం సంకల్పించి , చివరిలో మృత సంజీవిని మహా మంత్రం  తో పూర్తి చేసుకుంటున్నాము..

ఎన్ని  జన్మల పుణ్య ఫలం , మన శివ పరివారం కు భాగవత శ్రవణం. 

గురువు గారు కి స్పందన ఎలా తెలియచేయాలో తెలియయడం లేదు.., ఈ రోజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే

తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్

సమస్త పురాణాలను సంస్కృతంలో మూలరచన గావించిన వారు, వేదాలను విభాగించిన వారు వ్యాస భగవానులు. అన్నిటిలోకి ఉత్తమమైన శ్రీమద్భాగవతంలో భగవంతుని గురించి భాగవతుల గురించి చెప్పబడింది. అందుకే సద్యోముక్తి సాధనమిది.

భాగవతంలో పారమార్థానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం లోనే తెలియాచేసారు 

సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. అదే విధం గా మా పూజ్య గురువు గారు మా అందరికీ తెలియాచేసారు 

ఈ రోజుతో మనకి దశమ స్కంధం లో ఉత్తరభాగం పూర్తి అయినది..

ఒక్కసారి మనకి దశమ స్కంధం లో ఉత్తర భాగం లో ఏమిటన్నాయో తెలుసుకుందామము 

ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో ప్రద్యుమ్నుని జన్మము; శంబరాసురుని వృత్తాంతము; సత్రాజిత్తునకు సూర్యుడు శమంతకమణిని ఇచ్చుట; ఆ కారణముచేత ప్రసేనుడిని సింహము చంపుట; దానిని జాంబవంతుడు చంపి మణిని తీసుకెళ్ళుట; గోవిందుండు ప్రసేనుని చంపి శమంతకమణిని తీసుకుపోయాడు అని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి మీద నింద వేయుట; శ్రీకృష్ణుడు అందుకోసం జాంబవంతుడిని ఎదిరించి రత్నముతో పాటుగా జాంబవతిని తీసుకువచ్చి వివాహము చేసికొనుట సత్రాజిత్తునకు మణిని ఇచ్చుట; సత్యభామా పరిణయము; పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారు అని విని కృష్ణుడు బలభద్ర సహితుడు అయి హస్తినాపురమునకు వెళ్ళుట; అక్రూర కృతవర్మల అంగీకారముతో శతధన్వుడు సత్రాజిత్తుని చంపి శమంతకమణిని తీసుకుపోవుట; ఆ విషయమై సత్యభామ హస్తినాపురమునకు వెళ్ళి కృష్ణునికి చెప్పగా అతను వెనుకకు వచ్చి శతధన్వుని చంపుట బలరాముడు మిథిలానగరమునకు వెళ్ళుట; అక్కడ; దుర్యోధనుడు బలరాముని వద్ద గదావిద్య నేర్చుకొనుట; కృష్ణుడు సత్రాజిత్తునకు అపరకర్మలు చేయుట; శమంతకమణిని దాచిన అక్రూరుడు భయముతో ద్వారక విడిచి పోవుట; అతను లేకపోవుటచేత అనావృష్టి కలుగగా శ్రీకృష్ణుడు అక్రూరుని మరల రప్పించుట; దామోదరుడు ఇంద్రప్రస్థ పురమునకు వెళ్ళుట; అక్కడ అర్జునుని; సమేతుడు అయి వేటకి అడవికి వెళ్ళి కాళిందిని తీసుకు వచ్చుట; ఖాండవ దహనము చేయుట; అగ్నిదేవుడు అర్జునునికి అక్షయ తూణీరములు, గాండీవము, కవచము, రథము, గుఱ్ఱములు ఇచ్చుట; మయుడు ధర్మరాజునకు సభ నిర్మించి ఇచ్చుట; నగధరుండు తన పట్టణమునకు వెనుతిరిగి వచ్చి కాళిందిని; వివాహమాడుట; మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మద్ర రాజకన్యలను వరుసగా పెండ్లాడుట; నరకాసురునితో యుద్ధము అతని గృహములో ఉన్న రాజ కన్యలను పదహారువేల మందిని (16,000) తీసుకు వచ్చుట; స్వర్గ గమనము; అదితికి చెవికుండలములను ఇచ్చుట; పారిజాతాపహరణము; పదహారువేల మంది (16,000) రాజకన్యలను పరిణయ మాడుట; రుక్మిణీదేవి విప్రలంబము; రుక్మిణీదేవి స్తోత్రము; కృష్ణకుమార ఉత్పత్తి; వారి గురువుల లెక్క; ప్రద్యుమ్నుని వివాహము; అనిరుద్దుని జన్మము; అతని వివాహం కోసము కుండిననగరమునకు వెళ్ళుట; రుక్మి బలభద్రుల జూదము, రుక్మి వధ; ఉషాకన్య కలలో అనిరుద్ధుని చూసి మోహించుట; చిత్రరేఖ సకల దేశాల రాజులను చిత్రపటముపై లిఖించి చూపించి అనిరుద్ధుని తీసుకువచ్చుట; బాణాసురయుద్ధము; నృగోపాఖ్యానము; బలభద్రుని ఘోషయాత్ర; యమునను చీల్చుట; శ్రీకృష్ణుడు పౌండ్రకవాసుదేవుడు, కాశీరాజులను చంపుట; కాశీరాజు కొడుకు సుదక్షిణుడు అభిచారహోమం చేసి కృత్యను కృష్ణునిమీదకి పంపగా సుదర్శనచక్రము కృత్యను, సుదక్షిణుడు సహితంగా కాశీపురమును కాల్చివేయుట బలరాముడు; రైవతనగరములో ద్వివిదుని వధించుట; సాంబుడు దుర్యోధనుని కూతురు లక్షణను ఎత్తుకురాగా కౌరవులు అతనిని తీసుకువెళ్ళి చెఱబెట్టుట; ఆ విషయము నారదుని వలన విని బలరాముడు హస్తినాపురమునకు వెళ్ళుట; కౌరవులు ఆడిన అవమానపు మాటలకు కోపగించి హస్తినాపురమును గంగానదిలో పడవేయ బోవుట; కౌరవులు భయముతో అంగనాయుక్తముగా సాంబుడుని ఇచ్చుట; బలరాముడు ద్వారకకు వచ్చుట; నారదుడు, కృష్ణుడు పదహారువేల (16,000) కన్యకలను ఒకే ముహుర్తంలోనే అందఱికి అన్ని రూపులుతో పెండ్లి ఆడెను అని విని ఆ విధానము తెలిసికొన కోరి వచ్చుట; ఆ మహాత్మ్యమును చూసి మరలిపోవుట; జరాసంధుడి చేత చెరపట్టబడిన రాజులు కృష్ణుని వద్దకు దూతను పంపించుట; నారదుని ఆగమనము; పాండవుల ప్రశంస; ఉద్ధవుడు చేయవలసినపని తెలియజెప్పుట; ఇంద్రప్రస్థకు వెళ్ళుట; ధర్మరాజు రాజసూయ యాగము ప్రారంభము; దిగ్విజయము; జరాసంధ వధ; రాజులను చెరనుండి విడిపించుట; రాజసూయ యాగము నెఱవేర్చుట; శిశుపాలవధ; అవభృథము, రాజసూయ యాగముల వైభవము చూసి సహించలేని దుర్యోధనుడు మయసభలో కట్టుకొన్న బట్టలు తడిసిపోవునట్లు తూలుట; తన్నిమిత్తమైన పరాభవమును పొంది రారాజు వెళ్ళిపోవుట; కృష్ణుడు ధర్మరాజుచేత వేడుకొనబడి నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థము నందు ఉండుట; సాళ్వుడు తపస్సు చేసి హరుని మెప్పించి సౌభకము అను విమానము పొంది ద్వారకానగరమును నిరోధించుట; యాదవ సాళ్వ యుద్ధము; కృష్ణుడు వెనుదిరిగి వచ్చి సాల్వుని చంపుట; దంతవక్త్రవధ; విదూరథుని మరణము; కృష్ణుడు యాదవ సైన్యములతో మరలి ద్వారకకు వెళ్ళుట; కౌరవ పాండవుల యుద్ధము జరుగును అని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళుట; అక్కడ జాహ్నవీనది మున్నగు నదులందు స్నానముచేసి, నైమిశారణ్యమునకు వెళ్ళుట; అక్కడి ఋషులుచే పూజింపబడి దగ్గరలో ఉన్నత ఆసనముపై కూర్చుండి ఉన్న సూతుడు తనను చూసి లేవకపోవుటకు అలిగి బలరాముడు దర్భమొనతో అతనిని వధించుట; బ్రహ్మహత్యా దోషము కలిగినది అని మునులు చెప్పగా సూతుని; పునరుజ్జీవుని చేయుట; బలరాముడు ఇల్వలుని కొడుకు పల్వలుని చంపుట; వారి అనుమతిపొంది బలరాముడు ఆ సమీప తీర్థము లందు స్నానము చేసి గంగాసాగర సంగమమునకు వెళ్ళుట; మహేంద్ర పర్వతము చేరుట; పరశురామ దర్శనము; సప్తగోదావరిలో స్నానము చేయుట; ఇంకను ఉన్నట్టి తీర్థములందు స్నానము చేసి, శ్రీశైలము, వేంకటా చలములు దర్శించుట; వృషభాద్రి హరిక్షేత్రము సేతుబంధము రామేశ్వరములను దర్శించి తామ్రపర్ణి యందు జలకాలు ఆడుట; గోదానములు చేసి; మలయగిరిలో అగస్త్యుని దర్శించుట; కన్యాకుమాని కొలచుట; అక్కడ బ్రాహ్మణుల వలన పాండవ కౌరవుల యుద్ధమునందు సకల రాజులు చనిపోయిరి అని, భీమ సుయోధనులు గదాయుద్ధమునకు సిద్ధపడ్డారు అని విని వారిని వారించుటకై బలరాముడు అక్కడకు వెళ్ళుట; అక్కడ వారిచేత పూజింపబడి వారిని వారింపలేక వెనుదిరిగి ద్వారకకు వెళ్ళుట; మరల నైమిశారణ్యానికి పోయి అక్కడ యాగము చేసి రేవతీదేవి తాను అవభృతస్నానములు చేసి ద్వారకు వచ్చుట; కుచేలోపాఖ్యానము; సూర్యగ్రహణము నందు కృష్ణుడు బలరాముడు పురరక్షణకు కొడుకులను నిలిపి పదహారువేల స్త్రీలతోకూడి అక్రూర వసుదేవ ఉగ్రసేనాది యాదవశూరులు కూడ రాగా శమంతపంచకం వెళ్ళి స్నానములు చేసి వసియించి ఉండుట; పాండవ కౌరవాది సకల రాజులు ఆ తీర్థమునకు వచ్చుట; కుంతీదేవి దుఃఖము; నందయశోదా సహితులు ఐన గోపగోపికా జనాలు వచ్చుట; కుశలప్రశ్నలు ముచ్చట్లు; మద్రరాకుమారి లక్షణ ద్రౌపదీదేవిల ముచ్చట్లు; పిమ్మట, సకల రాజులు శమంతపంచకమున స్నానములు చేసి బలరామ కృష్ణాది యాదవ శూరుల అనుమతులు తీసుకొని తమ రాజ్యముకు పోవుట; కృష్ణుని దర్శించుటకు మునీంద్రులు వచ్చుట; వారి అనుమతితో వసుదేవుడు యాగము చేయుట; నంద యశోదాది గోపికలను తమ పురమునకు పంపించి ఉగ్రసేనాది యాదవ వీరులు తాను కృష్ణుడు ద్వారకకు చేరుట; ఇంతకు మునుపు కంసునిచేత చనిపోయి బలి పట్టణమునందు ఉన్న దేవకీదేవి పుత్రులను రామకృష్ణులు యోగమాయా బలంతో తీసుకు వచ్చి ఆమెకు ఇచ్చుట; అర్జునుడు సుభద్రను పెండ్లాడుట; కృష్ణుడు మిథిలకు వెళ్ళుట; శ్రుతదేవ జనకుల చరిత్రలు; బ్రాహ్మణ ప్రశంస; శ్రుతిగీతలు; కృష్ణుడు మఱలి తన నగరమునకు వచ్చుట; హరి హర బ్రహ్మదేవుల తారతమ్య వృత్తాంతము; కుశస్థలి విప్రుని చరిత్ర, అతని కొడుకులు చనిపోగా కృష్ణార్జునులు వారిని తీసుకు వచ్చి విప్రునకు ఇచ్చుట; కృష్ణుడు అర్జునునికి వీడ్కోలుచెప్పి ద్వారకకు వెళ్ళుట; అక్కడ మాధవుడు ఎల్ల భార్యలచేత పరివృతుడు అయి విహరించుట; యాదవ వృష్ణి భోజ అంధక వంశముల చరిత్రలు అనే కథలున్న దశమ స్కంధము లోని ఉత్తర భాగము.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*

ఓం! ఓం! ఓం! 

ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!

సర్వే జనా స్సుఖినో భవతు!!


ఇట్లు 

శివపరివారం 

1 comment:

  1. చాలా బాగుంది. ఇందులో మొదటి సగ భాగం మాత్రమే బాగా తెలుసు. మిగతాది అక్కడక్కడా.

    ReplyDelete