Saturday, July 17, 2021

బమ్మెర పోతన!

 బమ్మెర పోతన!

బమ్మెర పోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యా వివేక వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీ రామ పాద సేవార్చనా దురంధరుడు ఐన బమ్మెర పోతన మహానుభావుడు సంస్కృతం లోని భాగవతమును తెలుగులోకి అనువదించినవాడు మాత్రమే కాదు..శ్రీ కృష్ణ లీలామృత భాగవతంను సంస్కృతం తరవాత దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభం ఐంది. సంస్కృత భాగవతం తొలిగా తెలుగులోకి అనువదింప బడిన తర్వాతనే ఇతరదేశ భాషలలోకి అనువదించడం మహానుభావులు ఎందరో మొదలు బెట్టారు.

భక్తి వేదాంత తత్త్వంలో ప్రసిద్ధుడు అగ్రగణ్యుడు అని భావింప బడేకృష్ణ చైతన్యులు వంగ దేశంలో క్రీ.శ.1485 నుండి 1533 వరకూ జీవించినవాడు.ఆసేతు హిమాచలం పర్యటించిన కృష్ణ చైతన్యుడు పోతన వారి భాగవతంచేత ముగ్దుడైనాడు. చైతన్యుడు తెలుగు దేశానికి వచ్చినట్లుగా గుర్తుగా మంగళగిరి లో ఆయన పాదుకలు చెక్కబడి వున్నాయి. ఆతర్వాతి వాడైన మరొక మహానుభావుడు వల్లభాచార్యుల వారు తెలుగు బ్రాహ్మణుడు, ప్రత్యక్షంగా పోతన భాగవతం చేత ప్రభావితుడుఐన వాడు. చత్ర పతి శివాజీ మహారాజు గురువు, శ్రీ రామ, ఆంజనేయ సాక్షాత్కారం పొందినమహా ఉపాసకుడు, సమర్ధ రామదాసు మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా వచ్చి మరీ పోతనఆంధ్ర మహాభాగవతాన్ని విన్నాడు, పులకించి పోయాడు, ఈ విషయాలను ఆయనతన 'దాస బోధ' అనే గ్రంధం లో పేర్కొన్నాడు.

కౌండిన్య గోత్రము, అపస్తంభ సూత్రము నకు చెందిన వాడనని, కేసన, లక్కమాంబల పుత్రుడనని, తిప్పన తమ్ముడనని పోతన గారు తన ఆంధ్ర మహా భాగవత అవతారికలో చెప్పుకున్నారు.పురాణం హయగ్రీవ శాస్త్రి గారు, వావిలికొలను సుబ్బా రావు గారు, కందుకూరి వీరేశ లింగం పంతులు గారు ప్రభ్రుతులు పోతన రాయల సీమ లోని వొంటి మిట్ట వాడని భావించినా తర్వాత తమ అభిప్రాయములను మార్చుకున్నారు. ఆ తర్వాత మరికొందరు చారిత్రక పరిశోధకులు, సాహిత్యపరిశోధకులు, ప్రసిద్ధులు ఐన కొమర్రాజు లక్ష్మణ రావు గారు, శేషాద్రి రమణ కవులు, అనుముల సుబ్రమణ్య శాస్త్రి గారు, నిడదవోలు వేంకట రావు ప్రభ్రుతులు సాహిత్య, చారిత్రక, శాసనముల ఆధారములతో గుముదూరు శాసనంలో పేర్కొన బడిన వరంగల్ సమీపంలోని బమ్మెర గ్రామమే పోతన గారి జన్మ స్థలం అని నిర్ధారించి ఈ చర్చకు ఆంధ్ర దేశంలోని పండితులందరూ ముగింపు పలికారు. అంతే కాదు పోతన గారి ఆంధ్ర మహాభాగవతం లోని మిగిలిన భాగాలను పూరించిన వెలిగందల నారయ, ఏర్చూరి సింగన, గంగనలు కూడా వరంగల్ చుట్టు ప్రక్కలి ప్రాంతములకు చెందిన వారే అని నిరూపించారు. పోతనకు ప్రౌఢ సరస్వతి అని బిరుదు పొందిన కుమారుడు, అతని కుమారులైన కేసన, మల్లన సోదరులు (వీరు దాక్షాయణీ పరిణయం అనే గ్రంధ రచన చేశారు). బమ్మెర వారి యింటి ఆడ పడుచును పెండ్లి చేసుకున్న అజ్జరపు పేరయ లింగ కవి(ఇతను ఒడ నంబి విలాసం అనే వైష్ణవ భక్త శిఖామణిగురించిన గొప్ప గ్రంధం వ్రాశాడు)..ఇలా పోతన అనంతరం కూడా ఆ భక్తి, పాండిత్య విశేషాలు ఆయన వంశీకులకు సంప్రాప్తించాయి..వీరందరూ కూడా వరంగల్ ప్రాంతం వారే కావడం గమనార్హం.

పోతన కాలం గురించి రక రకాల పరిశోధనలు, వ్యాసాలూ వెలువరించిన ఈ వ్యాసంలో పైన పేర్కొనబడిన వారు అందరూ పోతన పదిహేనవ శతాబ్దమునకు చెందిన వాడని అంగీకరించారు. ఈ చిన్ని వ్యాసంలో పోతన ఆంధ్ర మహాభాగవత విమర్శ సాధ్యం కాదు గనుక క్లుప్తంగా చెప్పడం కోసం ఒక ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాన్ని సర్వ జనరంజకంగా, అద్భుతమైన పద గుంభనతో, లలితమైన పద విన్యాసంతో, భక్తి, పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చి దిద్దిన మహానుభావుడు పోతన.

తెలుగు పద్యానికి అత్యున్నత ఉదాహరణపోతన కవిత్వం. సంస్కృతంలో ఆది శంకరుడు తెలుగులో బమ్మెర పోతనలకు మాత్రమే సాధ్యమైన శైలి ఇది. మహానుభావులైన నన్నయ, తిక్కన, ఎర్రనలు, శ్రీనాధ మహాకవి, పెద్దన, రాయలు,భట్టు మూర్తి, తెనాలి రామ కృష్ణుడు, పింగళి సూరన, చేమకూర వేంకటకవి.. ఎందరున్నారు..ఎంతని పొగడ గలము..

ఆంధ్ర సాహిత్య సరస్వతీ పద నూపుర ధ్వనులెంత మధురిమలు? ఐనా..వచన రచనకు పోతనకు మించిన వారు ఎవరూ లేరు..నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకా పురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహా భాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి వున్నది.ఇక పద్య రచనా విధానం పొగడడానికి ఉద్గ్రంథా లౌతాయి. పద్యాలతో వర్ణ చిత్రాలు, భావ చిత్రాలు, చలన చిత్రాలు,నిశ్చలన చిత్రాలు, కుడ్య చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు..నిర్మించిన వాడు పోతన! భీష్మ ఘట్టం మొత్తం అద్భుతమైన వర్ణ చిత్రం. దశమ స్కంధం సాంతం నిరుపమానమైన భావ చిత్రం. వామన ఘట్టం లో ఎదుగుతున్న వామనుడిని 'ట్రెంచ్' షాట్లో చూపించాడు. గజేంద్ర మోక్షణం లో వైకుంఠ పురిని జూమ్ లెన్స్ లో చూపించాడు !

అద్భుతమైన కుడ్య చిత్రాలుగా, నిశ్చలన చిత్రాలుగా తమ ప్రణయ, దాస్య భక్తిలో నిశ్చేష్టులైన రుక్మిణి, ప్రహ్లాదుడు, నారదుడు, కుంతీ, కుచేలుడు,ఉద్ధవుడు, అర్జునుడు, గోపికలు..వీరందరి నవరస భావ ప్రకటనలతో కూడిన వర్ణ చిత్రాలుగా ఆయా ఘట్టాలను ఆవిష్కరించాడు! తెలుగు కవులలో భక్తికి గానీ,పాండిత్యానికి గానీ, వేదాంతానికి గానీ, నిజాయితీ తో కూడిన అత్మాభిమానానికి గానీ, వినయంలో గానీ,విచక్షణ లో గానీ, మృదువైన, మెత్తనైన, సంగీతమయమైన. ఆర్ద్రమైన, ఆనందాంబుధిలో ముంచెత్తే అమర భాగీరధీ ప్రవాహ సమాన పవిత్రతలో గానీ.. పోతన ను మించిన వారు లేరు, రారు

దశమ స్కంధము - ఉత్తర భాగం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

గత 16 నెలలు నుంచి మనకి గంగా ప్రవాహం లా జరిగియే శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ఘట్టం ఈ రోజు అష్టమి తిధి కి దశమ స్కంధం లో ఉన్న ఉత్తర భాగం పరిపూర్ణమైనది..ఎందుకో తెలియదు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి . అప్పుడే భాగవతం అయిపోతోందా అని..

ఆ శ్రీకృష్ణ పరమాత్మా దయవలన ఇప్పటి వరకు ఎన్ని ఆటకంకాలు వచ్చినా , మన పూజ్య గురువు గారు భాగవతం ను లోక కళ్యణమ్ కోసం , కరోనా నివారణార్ధం సంకల్పించి , చివరిలో మృత సంజీవిని మహా మంత్రం  తో పూర్తి చేసుకుంటున్నాము..

ఎన్ని  జన్మల పుణ్య ఫలం , మన శివ పరివారం కు భాగవత శ్రవణం. 

గురువు గారు కి స్పందన ఎలా తెలియచేయాలో తెలియయడం లేదు.., ఈ రోజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే

తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్

సమస్త పురాణాలను సంస్కృతంలో మూలరచన గావించిన వారు, వేదాలను విభాగించిన వారు వ్యాస భగవానులు. అన్నిటిలోకి ఉత్తమమైన శ్రీమద్భాగవతంలో భగవంతుని గురించి భాగవతుల గురించి చెప్పబడింది. అందుకే సద్యోముక్తి సాధనమిది.

భాగవతంలో పారమార్థానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం లోనే తెలియాచేసారు 

సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. అదే విధం గా మా పూజ్య గురువు గారు మా అందరికీ తెలియాచేసారు 

ఈ రోజుతో మనకి దశమ స్కంధం లో ఉత్తరభాగం పూర్తి అయినది..

ఒక్కసారి మనకి దశమ స్కంధం లో ఉత్తర భాగం లో ఏమిటన్నాయో తెలుసుకుందామము 

ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో ప్రద్యుమ్నుని జన్మము; శంబరాసురుని వృత్తాంతము; సత్రాజిత్తునకు సూర్యుడు శమంతకమణిని ఇచ్చుట; ఆ కారణముచేత ప్రసేనుడిని సింహము చంపుట; దానిని జాంబవంతుడు చంపి మణిని తీసుకెళ్ళుట; గోవిందుండు ప్రసేనుని చంపి శమంతకమణిని తీసుకుపోయాడు అని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి మీద నింద వేయుట; శ్రీకృష్ణుడు అందుకోసం జాంబవంతుడిని ఎదిరించి రత్నముతో పాటుగా జాంబవతిని తీసుకువచ్చి వివాహము చేసికొనుట సత్రాజిత్తునకు మణిని ఇచ్చుట; సత్యభామా పరిణయము; పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారు అని విని కృష్ణుడు బలభద్ర సహితుడు అయి హస్తినాపురమునకు వెళ్ళుట; అక్రూర కృతవర్మల అంగీకారముతో శతధన్వుడు సత్రాజిత్తుని చంపి శమంతకమణిని తీసుకుపోవుట; ఆ విషయమై సత్యభామ హస్తినాపురమునకు వెళ్ళి కృష్ణునికి చెప్పగా అతను వెనుకకు వచ్చి శతధన్వుని చంపుట బలరాముడు మిథిలానగరమునకు వెళ్ళుట; అక్కడ; దుర్యోధనుడు బలరాముని వద్ద గదావిద్య నేర్చుకొనుట; కృష్ణుడు సత్రాజిత్తునకు అపరకర్మలు చేయుట; శమంతకమణిని దాచిన అక్రూరుడు భయముతో ద్వారక విడిచి పోవుట; అతను లేకపోవుటచేత అనావృష్టి కలుగగా శ్రీకృష్ణుడు అక్రూరుని మరల రప్పించుట; దామోదరుడు ఇంద్రప్రస్థ పురమునకు వెళ్ళుట; అక్కడ అర్జునుని; సమేతుడు అయి వేటకి అడవికి వెళ్ళి కాళిందిని తీసుకు వచ్చుట; ఖాండవ దహనము చేయుట; అగ్నిదేవుడు అర్జునునికి అక్షయ తూణీరములు, గాండీవము, కవచము, రథము, గుఱ్ఱములు ఇచ్చుట; మయుడు ధర్మరాజునకు సభ నిర్మించి ఇచ్చుట; నగధరుండు తన పట్టణమునకు వెనుతిరిగి వచ్చి కాళిందిని; వివాహమాడుట; మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మద్ర రాజకన్యలను వరుసగా పెండ్లాడుట; నరకాసురునితో యుద్ధము అతని గృహములో ఉన్న రాజ కన్యలను పదహారువేల మందిని (16,000) తీసుకు వచ్చుట; స్వర్గ గమనము; అదితికి చెవికుండలములను ఇచ్చుట; పారిజాతాపహరణము; పదహారువేల మంది (16,000) రాజకన్యలను పరిణయ మాడుట; రుక్మిణీదేవి విప్రలంబము; రుక్మిణీదేవి స్తోత్రము; కృష్ణకుమార ఉత్పత్తి; వారి గురువుల లెక్క; ప్రద్యుమ్నుని వివాహము; అనిరుద్దుని జన్మము; అతని వివాహం కోసము కుండిననగరమునకు వెళ్ళుట; రుక్మి బలభద్రుల జూదము, రుక్మి వధ; ఉషాకన్య కలలో అనిరుద్ధుని చూసి మోహించుట; చిత్రరేఖ సకల దేశాల రాజులను చిత్రపటముపై లిఖించి చూపించి అనిరుద్ధుని తీసుకువచ్చుట; బాణాసురయుద్ధము; నృగోపాఖ్యానము; బలభద్రుని ఘోషయాత్ర; యమునను చీల్చుట; శ్రీకృష్ణుడు పౌండ్రకవాసుదేవుడు, కాశీరాజులను చంపుట; కాశీరాజు కొడుకు సుదక్షిణుడు అభిచారహోమం చేసి కృత్యను కృష్ణునిమీదకి పంపగా సుదర్శనచక్రము కృత్యను, సుదక్షిణుడు సహితంగా కాశీపురమును కాల్చివేయుట బలరాముడు; రైవతనగరములో ద్వివిదుని వధించుట; సాంబుడు దుర్యోధనుని కూతురు లక్షణను ఎత్తుకురాగా కౌరవులు అతనిని తీసుకువెళ్ళి చెఱబెట్టుట; ఆ విషయము నారదుని వలన విని బలరాముడు హస్తినాపురమునకు వెళ్ళుట; కౌరవులు ఆడిన అవమానపు మాటలకు కోపగించి హస్తినాపురమును గంగానదిలో పడవేయ బోవుట; కౌరవులు భయముతో అంగనాయుక్తముగా సాంబుడుని ఇచ్చుట; బలరాముడు ద్వారకకు వచ్చుట; నారదుడు, కృష్ణుడు పదహారువేల (16,000) కన్యకలను ఒకే ముహుర్తంలోనే అందఱికి అన్ని రూపులుతో పెండ్లి ఆడెను అని విని ఆ విధానము తెలిసికొన కోరి వచ్చుట; ఆ మహాత్మ్యమును చూసి మరలిపోవుట; జరాసంధుడి చేత చెరపట్టబడిన రాజులు కృష్ణుని వద్దకు దూతను పంపించుట; నారదుని ఆగమనము; పాండవుల ప్రశంస; ఉద్ధవుడు చేయవలసినపని తెలియజెప్పుట; ఇంద్రప్రస్థకు వెళ్ళుట; ధర్మరాజు రాజసూయ యాగము ప్రారంభము; దిగ్విజయము; జరాసంధ వధ; రాజులను చెరనుండి విడిపించుట; రాజసూయ యాగము నెఱవేర్చుట; శిశుపాలవధ; అవభృథము, రాజసూయ యాగముల వైభవము చూసి సహించలేని దుర్యోధనుడు మయసభలో కట్టుకొన్న బట్టలు తడిసిపోవునట్లు తూలుట; తన్నిమిత్తమైన పరాభవమును పొంది రారాజు వెళ్ళిపోవుట; కృష్ణుడు ధర్మరాజుచేత వేడుకొనబడి నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థము నందు ఉండుట; సాళ్వుడు తపస్సు చేసి హరుని మెప్పించి సౌభకము అను విమానము పొంది ద్వారకానగరమును నిరోధించుట; యాదవ సాళ్వ యుద్ధము; కృష్ణుడు వెనుదిరిగి వచ్చి సాల్వుని చంపుట; దంతవక్త్రవధ; విదూరథుని మరణము; కృష్ణుడు యాదవ సైన్యములతో మరలి ద్వారకకు వెళ్ళుట; కౌరవ పాండవుల యుద్ధము జరుగును అని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళుట; అక్కడ జాహ్నవీనది మున్నగు నదులందు స్నానముచేసి, నైమిశారణ్యమునకు వెళ్ళుట; అక్కడి ఋషులుచే పూజింపబడి దగ్గరలో ఉన్నత ఆసనముపై కూర్చుండి ఉన్న సూతుడు తనను చూసి లేవకపోవుటకు అలిగి బలరాముడు దర్భమొనతో అతనిని వధించుట; బ్రహ్మహత్యా దోషము కలిగినది అని మునులు చెప్పగా సూతుని; పునరుజ్జీవుని చేయుట; బలరాముడు ఇల్వలుని కొడుకు పల్వలుని చంపుట; వారి అనుమతిపొంది బలరాముడు ఆ సమీప తీర్థము లందు స్నానము చేసి గంగాసాగర సంగమమునకు వెళ్ళుట; మహేంద్ర పర్వతము చేరుట; పరశురామ దర్శనము; సప్తగోదావరిలో స్నానము చేయుట; ఇంకను ఉన్నట్టి తీర్థములందు స్నానము చేసి, శ్రీశైలము, వేంకటా చలములు దర్శించుట; వృషభాద్రి హరిక్షేత్రము సేతుబంధము రామేశ్వరములను దర్శించి తామ్రపర్ణి యందు జలకాలు ఆడుట; గోదానములు చేసి; మలయగిరిలో అగస్త్యుని దర్శించుట; కన్యాకుమాని కొలచుట; అక్కడ బ్రాహ్మణుల వలన పాండవ కౌరవుల యుద్ధమునందు సకల రాజులు చనిపోయిరి అని, భీమ సుయోధనులు గదాయుద్ధమునకు సిద్ధపడ్డారు అని విని వారిని వారించుటకై బలరాముడు అక్కడకు వెళ్ళుట; అక్కడ వారిచేత పూజింపబడి వారిని వారింపలేక వెనుదిరిగి ద్వారకకు వెళ్ళుట; మరల నైమిశారణ్యానికి పోయి అక్కడ యాగము చేసి రేవతీదేవి తాను అవభృతస్నానములు చేసి ద్వారకు వచ్చుట; కుచేలోపాఖ్యానము; సూర్యగ్రహణము నందు కృష్ణుడు బలరాముడు పురరక్షణకు కొడుకులను నిలిపి పదహారువేల స్త్రీలతోకూడి అక్రూర వసుదేవ ఉగ్రసేనాది యాదవశూరులు కూడ రాగా శమంతపంచకం వెళ్ళి స్నానములు చేసి వసియించి ఉండుట; పాండవ కౌరవాది సకల రాజులు ఆ తీర్థమునకు వచ్చుట; కుంతీదేవి దుఃఖము; నందయశోదా సహితులు ఐన గోపగోపికా జనాలు వచ్చుట; కుశలప్రశ్నలు ముచ్చట్లు; మద్రరాకుమారి లక్షణ ద్రౌపదీదేవిల ముచ్చట్లు; పిమ్మట, సకల రాజులు శమంతపంచకమున స్నానములు చేసి బలరామ కృష్ణాది యాదవ శూరుల అనుమతులు తీసుకొని తమ రాజ్యముకు పోవుట; కృష్ణుని దర్శించుటకు మునీంద్రులు వచ్చుట; వారి అనుమతితో వసుదేవుడు యాగము చేయుట; నంద యశోదాది గోపికలను తమ పురమునకు పంపించి ఉగ్రసేనాది యాదవ వీరులు తాను కృష్ణుడు ద్వారకకు చేరుట; ఇంతకు మునుపు కంసునిచేత చనిపోయి బలి పట్టణమునందు ఉన్న దేవకీదేవి పుత్రులను రామకృష్ణులు యోగమాయా బలంతో తీసుకు వచ్చి ఆమెకు ఇచ్చుట; అర్జునుడు సుభద్రను పెండ్లాడుట; కృష్ణుడు మిథిలకు వెళ్ళుట; శ్రుతదేవ జనకుల చరిత్రలు; బ్రాహ్మణ ప్రశంస; శ్రుతిగీతలు; కృష్ణుడు మఱలి తన నగరమునకు వచ్చుట; హరి హర బ్రహ్మదేవుల తారతమ్య వృత్తాంతము; కుశస్థలి విప్రుని చరిత్ర, అతని కొడుకులు చనిపోగా కృష్ణార్జునులు వారిని తీసుకు వచ్చి విప్రునకు ఇచ్చుట; కృష్ణుడు అర్జునునికి వీడ్కోలుచెప్పి ద్వారకకు వెళ్ళుట; అక్కడ మాధవుడు ఎల్ల భార్యలచేత పరివృతుడు అయి విహరించుట; యాదవ వృష్ణి భోజ అంధక వంశముల చరిత్రలు అనే కథలున్న దశమ స్కంధము లోని ఉత్తర భాగము.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*

ఓం! ఓం! ఓం! 

ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!

సర్వే జనా స్సుఖినో భవతు!!


ఇట్లు 

శివపరివారం 

Saturday, July 10, 2021

గురువు గారు - శివ పరివారం

ఈ నెల 24 వ తారీఖున గురు పౌర్ణమి అయ్యింది.. ఆ తర్వాత రోజున ఆదివారం నాడు మా పూజ్య గురువు గారు అయినా శ్రీ రాళ్లబండి రామ కృష్ణ శర్మ గారు కి మేము చిరు సత్కారం చేసుకోవాలని పరమేశ్వర సంకల్పం 

ముందుగా మా గురువు గారు గురించి ఓ నాలుగు మాటలు , మా గురువు గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు (ప్రైవేట్ పాఠశాలా లో ) గా పనిచేసారు .  కొన్ని కారణాలు వలన ఉపాధ్యా య వృత్తి కి స్వస్తి చెప్పి , తానూ నమ్ముకున్న ఆధ్యాత్మిక మార్గం లో మా గురువు గారు నిత్యా కర్మానుష్ఠానం చేసుకుంటూ  ఆధ్యాత్మికం గా మా శిష్యులు అందరికీ దగ్గరయ్యారు.. మా అందరికీ ఆధ్యాత్మిక గ్యాన బోధ , సమయాచారం సదాచారం అన్ని వివరిస్తూ , మాకు తెలియని ఎన్నో విశేషాలు మాకు తెలియపరిచారు..

మా గురువు గారు పుట్టిన ప్రదేశం గుడివాడ , కృష్ణ జిల్లా , తల్లి తండ్రులు సుబ్రహ్మణ్య దీక్షితులు , అన్నపూర్ణమ్మగారు 4 వ సంతానం 

మా గురువు గారు ఆంధ్ర యూనివర్సిటీ లో MA ఎకనామిక్స్ మరియు MA ఇంగ్లీష్ కూడా చేసారు.. మా గురువు గారు అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు , పని చేసిన స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం , తండ్రి గారు ద్వారా సంస్కృతం మరియు భారతము  భాగవతం విశేషాలు కూడా చిన్నతనం నుంచి నేర్చుకున్నారు.ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు 

మేము మా గురువు గారు తో పెట్టుకున్న సత్సంఘం పేరు శివ పరివారం 

మేము ఏ కార్యక్రం చేసిన సర్వం శ్రీ శివ పరివారం అని  చేస్తాము.. 

మా శివ పరివారం విశేషం ఏమిటంటే ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తప్పనిసరిగా స్వామి వారికీ పాశుపత రుద్రాభిషేకం , లేదా ఆ రోజు విశిస్థను బట్టి అన్నాభిషేకం , పుష్పాభిషేకం ,లేక పంచ అమృతం తో స్వామి వారికీ పాశుపతం చేసుకుంటాము 

ఇలా 2005 నుంచి ఇప్పటివరకు ఎక్కడ బ్రేక్ లేకుండా చేసాము అది కూడా ఎవరు  పిలిస్తే వాళ్ళ ఇంటికి. వెళ్లి ఆ మహాదేవుడికి అభిషేకం చేసి వస్తాము . మాకు కావలసింది భక్తి శ్రద్ద..ఏనాడూ మేము ఎవరి దగ్గర దక్షణా ఆశించలేదు..తిరిగి మేమె దేవాలయం లో అభిషేకం చేసి దేవాలయ పునరుద్దరణకు కొంత ఇచ్చేవాళ్ళం. దక్షినాపేక్ష లేకుండా ఉండడమే ఆ గురువు యోక్క్క విశిష్టత..

శాస్త్రం లో ఒక మాట ఉంది , ఏ ఇంట్లో అయితే ధూప దీప నైవేద్యాలు తో ఇల్లు ఉంటుందో., ఏ ఇంట్లో అయితే శివ అభిషేకం లేదా ఈశ్వరాభిషేకం జరుగుతుందో ఆ ఇల్లు ని గృహముగా పరిగణిస్తారు అని మా గురువు గారు మాకు తరచూ చెబుతూ ఉంటారు..

అసలు ఆధ్యాత్మిక గురువు కి నిర్వచనం ను ఒక్క మాటలో చెప్పాలంటే  మా పూజ్య గురువు గారు ..వారి సతీమణి గారు . వారి ఇల్లు నిత్యం గంగ ప్రవాహం లా ఉంటుంది..

మా అందరి ద్రుష్టి లో అది వారి గృహం కాదు . మా అందరికీ అమ్మవారు ఉండే దేవాలయం. 

నిత్యం చండీ పారాయణ, అభిషేకాలు , వ్రతాలూ, సుందరకాండ పారాయణాలు , మా శిష్య బృందం లో ఎవరు ఏమి శుభకార్యం చెయ్యాలన్న గురువు గారు ఇంటికి వచేస్తాము ఆ స్వామి వారికీ అభిషేకం గురువు గారు దగ్గర చేసుకుంటాము..

ప్రతి పౌర్ణమికి , మరియు మాస శివరాత్రి మా గురువు గారు ఇల్లు దేవాలయ మంటపం లా ఉంటుంది.. అది చాల విశిష్టమైనది గా ఆ రోజుని చేసుకుంటాము..

అలాగే శని త్రయోదశి రోజున స్వామి వారికీ తైలాభిషేకం చేసుకుంటాము..

మనకి ఏది కావాలన్నా ఒకటే మార్గం ఆ స్వామి వారికీ అభిషేకం చేసుకోవడం.. అంటే..

ఈశ్వరుడికి తెలియనిది ఏముంటుంది..అంటారు గురువు గారు ..

 ఆలా స్వామి వారికీ  అభిషేకం మరోపక్క చండీ పారాయణాలు జరుగుతూ ఉంటాయి.. 

మా గురువు గారు చండీ ఉపాసకులు , దశ మహావిద్యలు ఉపాసన మంత్రం తో చేసుకుతూ ఉంటారు....

ఇప్పటికే అమ్మవారి దశ మహా విద్యలు లో 6 వరకు హోమాలు చేసారు 

అలాగే అమ్మవారి శతచండీ మహా యాగం కూడా చేసారు  ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు తో నిర్వహించారు.. శతచండీ యాగం అత్యంత అత్బుటం గా జరిగింది అనడానికి నిదర్శనం మా అందరికీ హోమగుండం లోంచి అమ్మవారు కనబడినది.

అలాగే గురువు తో తీర్ధయాత్ర అంటారు..మేము మా గురువు గారు తో కాశీ మరియు నైమిశారణ్యం ను చూడగలిగాము.. అక్కడ  విశిష్టత ను మాకు తెలియచేసారు.. అలాగే పుణ్యకేత్రాలు ,ఉజ్జయిని మొ.. ప్రదేశాలు కూడా చూసాము

కాశీ లో దేవి నవరాత్రులు , చివరిగా చండీ హోమం చేసుకున్నాము . సాక్షాతూ ఆ కాశీ విశ్వేశ్వరుడే మాకు ఆ హోమం చేయించారా అన్నట్టు గా జరిగింది.. ఎందుకంటే దసరా రోజున , కాశీ మహా పట్టణం లో బాషా కానీ ప్రదేశం లో మేము చండి హోమం ఎలా నిర్వహించాలి అని ఆలోచించుకున్నాము.. మేము పరివారం తో మొదటి సారి, అమ్మవారు ని ప్రార్ధిచగా కాశీ దేవాలయ పండితుడు ఒకరు పంపారు అని అయన పేరు శ్యామ్ గారు ఒక్క నలుగురు వేదం పండితులు తో వచ్చి వారే స్వయం గా చేసారు.. మేము దక్షిణ ఇస్తుంటే , కాశీ వచ్చి మీరు నాకు దక్షిణ ఇస్తారా అని ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు..ఇప్పటికీ ఆ సన్నివేశం మా అందరి కళ్ళల్లోనూ మెదులుతోంది..

ఇలాగే నైమిశారణ్యం లో కూడా అంటే  మా టీచర్ గారు ఇక నడవలేను అని కూర్చుంటే , హనుమంతుడి ఒక బ్రాహ్మణుడు వేషం లో వచ్చి మా టీచర్ గరుని మాటల్లో పెట్టాలి నైమిశారణ్యము మొత్తం నడిపించి చూపించారు..అంతా ఈశ్వరుడు మాకు ఇచ్చిన గురువు గారు ఆశీస్సులు 

మా గురువు గారు పూర్ణ దీక్షపరులు , శిష్యులకి కూడా కొంత మందికి పూర్ణ దీక్షత్వం ఇచ్చారు..

ఒక గురువు వారి శిష్యులు కి పూర్ణ దీక్షత్వం ను ఎలా ఇవ్వాలో , శాస్త్రం లో ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారు.. ఒక గురువు శిష్యుడికి  అడిగిన వెంటనే ఎప్పుడు మాత్రం లాంటివి ఇవ్వరు. ఆ గురువు శిష్యుడిని గమనిస్తూ , అతనికి మంత్రం మీద ఉన్న ఆసక్తిని గురు శుశ్రూషని బట్టి గురువు ఆ శిష్యుడికి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో అప్పుడే మంత్రం లాంటిది ఇస్తారు..ఒక గురువు శిష్యుడికి మంత్రం ఇచ్చారు అంటే గురువు తన ఊపిరిని కొంత ఇస్తున్నట్లు గా మా గురువు గారు భావిస్తారు..

అలాగే మా గురువు గారు శిష్యులు లో ఎవరికీ కష్టం వచ్చినా తనకి వచ్చినట్టే బాధపడతారు. వారికోసం అమ్మవారు ని ప్రాధేయపడతారు 

అలాగే మాస శివరాత్రి , మహా శివరాత్రి ని అత్యంత వైభవం గా జరుపుకుంటాం మా శివ పరివారం.

మా శివ పరివారం కు మహా శివ రాత్రి వచ్చిందంటే చాలు అది ఒక పెద్ద పండగా చేసుకుంటము..ఏకాదశ రుద్రం , అఖండ రుద్రాభిషేకం , ఏకవారం, ఆలా అన్ని రకాలు గా జరుగుతాయి.. కావలసిన పదార్ధములు పరివారం లో సభ్యులు ముందుగా నిర్ణయిచుకుని ఏర్పుటు చేస్తారు. అలాగే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కూడా అంటే ప్రదోష వేళా సమయం కు కచ్చితం గా ఆ స్వామి వారికీ అభిషేకం చెయ్యాలి అని సంకల్పం..

శాస్త్రం లో మనకి నవరాత్రలు నాలుగు వస్తాయి ,నవరాత్రులూ అనగానే మనకి ముందుగా ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు తలంపుకు వస్తాయి!

అలాగే చైత్ర మాసం లో వచ్చే వసంత నవరాత్రులు కూడ మనకి పరిచయమే!

ఈ రెండూ కాక మరో రెండు నవరాత్రులు వున్నాయి.వాటి గురించి చిన్న వివరణ.

1 చైత్రమాసమున వసంత నవరాత్రములు

2 ఆషాఢమున వారాహీ నవరాత్రులు

3 ఆశ్వీజమున శరన్నవరాత్రులు దుర్గాదేవి

4.మాఘమాసమున శ్యామలదేవి నవరాత్రులు.

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.ఆషాఢ శధ్ధ పాడ్యమి నుండీ వారాహీ నవరాత్రలు ప్రారంభం! అవి గుప్తం గా చేసుకుంటారు 

ఆశ్వీజమున జరిగే  శరన్నవరాత్రులు మా గురువు గారు ఇంట్లో  అంగ రంగ వైభవం గా జరుగుతాయి..నిత్యం అమ్మవారి అలంకరణ, పూజ, పరివారం లో సభ్యులు, పగలు ఉపవాసం ,రాత్రి భోజనాలు , సాయంత్రం అమ్మవారి కుంకుమ పూజ, సువాసిని పూజ,

ఒక్కసారి గా చుస్తే శృంగేరి లో అమ్మవారి దేవి నవరాత్రులు ఎలా నిర్వహిస్తారో అలాగే మా గురువు గారు ఇంట్లో జరుగుతాయి..శ్రీ చక్రార్చన , నవవార్చన మొ అన్ని సాంప్రదాయ పద్దతిగా , శాస్త్రీయం గా సనాతనంగా కనబడతాయి..కంకణ ధార చేసుకున్నవారు గురువు గారు ఇంట్లోనే ఉంటారు..

సాధారణం గా మా గురువు గారు దేవి నవరాత్రులు ని వారి స్వగృహం లోనే నిర్వహిస్తారు.. ఒక్కసారి మాత్రం కాశీ లోను , ఇంకోసారి సరూర్ నగర్ లో ఉన్న ఈశ్వరాలయం లో నిర్వహిచారు.. నిత్యం రుద్ర హోమం, ఆఖరి రోజున చండీ హోమం తప్పనిసరిగా చేస్తారు.. ఈ మధ్య జరిగిన దసరా నవరాత్రులు లో ఈశ్వరుడు కి రోజుకో ఒక పాశుపతం చేసుకున్నాము . 

ఒక్క మాటలో చెప్పాలంటే శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. 

రుద్రము నందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి. 

ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, ఉన్నవాళ్లు మాత్రమే  చేస్తేనే మంచి ఫలితములను ఇస్తుంది.

మా గురువు గారు అబ్బాయి శ్రీ శశికాంత శర్మ కూడా వేదం చదువుకుని మా గురువు గారు చేసే కార్యక్రం లో సహకరిస్తారు.. 

మహా పాశుపతము ,త్రిశూల పాశుపతము ,ఆఘోర పాశుపతము , నవగ్రహ పాశుపతము 

కౌబేర పాశుపతము ,మన్యు పాశుపతము, కన్యా పాశుపతము , బుణ విమోచన పాశుపతము ,సంతాన పాశుపతము , ఇంద్రాక్షీ పాశుపతము  చేసుకున్నాము 

చివరిగా మా శివ పరివారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే సమయం కార్తీకం .. కార్తీక మాసం అంటే మా శివ పరివారం కు చాల ఇష్టం..సాయంత్రం పూట మా శివ పరివారం సభ్యులు ఇళ్లల్లో జ్యోతిర్లింగార్చన , ఒకపక్క, చండీ పారాయణ కొంతమంది , పురుషులు స్వామి వారికీ అబీషకేకం చేసుకుని ఆ రాత్రి వారి ఇంట్లో అన్నప్రసాదం తీసుకుంటాము..

ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రం మా కామాక్షి శంకరులు స్వగ్రహం లో జరుగుతుంది.. ఉదయం అంతటా నత్తాలు తో ఉంది రాత్రి పూట జ్యోతిర్లింగార్చన అనంతరం అన్నప్రసాదం తీసుకుంటాము..ఈ కార్యక్రం కోసము మా పరివారం లో సభ్యులు ఒక 10 రోజులు ముందుగానే వారు గురువు గారు దగ్గరకి వచ్చి విన్నవించుకుంటారు.. మా ఇంట్లో స్వామి వారి అభిషేకం , జ్యోతిలింగార్చిన చేయాలనీ..

ఒకసారి మా గురువు గారు చేయించే జ్యోతిలింగార్చిన ని చుస్తే మన మనసుకు అనిపిస్తుంది..సాక్షాత్తూ కైలాసం లో ఉన్న నివాసము పరమేశ్వరుడు ఆ జోతిర్లింగార్చన లో కనబడతారు.. అది కూడా మంత్రం యుగ్మగా , అనుష్టాన దేవతలును ఆహ్వానించి , వారిని ఆసన చేసి అప్పుడు మహాలింగం కు ఆవాహన చేస్తారు.. 

మేము ఏది చేసిన శృంగేరి లో ఎలా చేస్తారో అలాగే చేస్తాము..శాస్త్రం ఏది చెప్పినాడో అదే ప్రామాణికం..

కార్తీకమాసం లోనే జ్యోతిర్లింగార్చన ఎందుకు చేస్తారు అనేది మన సనాతన ధర్మము లో ఎంత బాగా వివరించారో.. మన పూర్వికులు ఏది చేసిన అది శాస్త్రీయత ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు.. 

మాకు ఇలా అభిషేకములు , జ్యోతిలింగార్చన సమయం లో మా గురువు గారు మంచి మంచి విషయాలు , ఆధ్యాత్మిక , సనాతన ధర్మాలు వాటి విలువలు ని మా అందరికీ తెలియాపరుస్తారు.ముచ్చటగా మనుసులో మాటలు పంచుకోవడానికి...

కష్ట సుఖాలు తెలుపుకోవడానికి  మంచి చెడులు తెలిపే ఓ నేస్తం లా, గురువు లా , ఒక తండ్రి లా , ఒక ఆత్మీయులుగా  పలకరిస్తారు , మేము ఆలా కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకునేందుకు మాకెప్పుడు కావాలి మీ చల్లని స్నేహ హస్తం తో మా గురువు గారు మాకు ఉంటున్నారు 

ఊపిరి పీలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో మనం అందరం ఉండగా  , మకకి కావలసింది , తెలుసుకోవలసినది చాల ఉంది అని మాకు తెలియయచేసి  

...మేము  తడబడినప్పుడు వెన్ను తడుతూ ,మా ఆలోచనల ఉహల తోడుగా

నిలుస్తూ , మాకు సరి అయినా సమయం లో మంచి విషయాలు తెలిసిచ్చేస్తారు 

నిరాశ ,నిస్ప్ర హ ,నిర్లక్ష్యం లను మా గురువు గారు వారి  దరిచేరకుండా నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన ఆలోచనలతో , నిశ్శబ్దా భావాల్ని సవరిస్తూ ,మా శిష్య  సంబంధాలను పరిరక్షించుకుంటూ మాతో పంచుకుంటూ , కాలం అనే కల్పవృక్షము ను మా  సంకల్పాలను తీర్చుకునేందుకు కాలంతో కలసి పయనించి మా  జీవిత గమ్యాన్ని నిర్దేశించిన మా గరువులుగారు కి పాదాభివందనములు 

ఇక అసలు విషయానికి వద్దాము 

మన అందరికీ తెలుసు గత సం నుంచి మనకి కరోనా వలన ఇబ్బందులు పడుతున్నము 

మేము కరోనా లొక్డౌన్ మొదలు అయినప్పటినుంచి మేము శ్రీమద ఆంధ్ర మహా భాగవతం ను ప్రవచనం గా గురువు గారు చెప్పడం జరిగింది..

షోడశ మాస్ శ్రీ మాడ ఆంధ్ర మహా భాగవతం 

ఈ ప్రవచనం లో పద్యం, వచనం, తాత్పర్యం మరియు సన్నివేశాన్ని బట్టి గురువు గారు మాకు వివిధ పురాణాలూ లో ఉండే విషయాలు కూడా తెలియచేసారు..

ఆ అమృత భాండాగారాన్ని మా అందరికీ అందించే ప్రయత్నం చేసారు..

ప్రవచనం అనంతరం , దూప దీప నైవేద్య తో పాటు మృత సంజీవిని పారాయణ చేసే వారు.. అలాగే గురువు గారు చేసే పారాయణ లో కొంత భాగాన్ని భారత దేశం కోసం ఇవ్వడం , అలాగే మా చే కూడా ఆ సంకల్పం చెప్పిచడం కరోనా నివారణార్ధం కొత్త భాగాన్ని సమర్పించడం మా శివ పరివారం కు మా గురువు గారు నేర్పిచారు..

అందరు బాగుంది.. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా..లోక సమస్త సుఖినోభవంతు అన్న నానుడి తో..

మేము ఈ గురు పౌర్ణమి ని కొంచం అంగ రంగ వైభవం గా చేద్దామని సంకల్పం.    షోడశ మాస శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ను మా పూజ్య గురువు గారు మాకు పద్యం శ్రవణం వచనం తాత్పర్యం రూపం లో  మాకు అర్ధమయ్యే రీతి లో చెప్పారు. అటువంటి మహానుభావులు గురువు గారుని మేము సత్కరించుకోవలని ఈశ్వర సంకల్పం తో 

మా గురువు గారుకు చిరు సత్కారం చేస్తున్నాము.

అయితే మా గురువు గారు మమ్మలిని గురు దక్షిణ అడిగారు. అది ఏమిటంటే ఎవరు ఎవరు శ్రీ మద్ భాగవతం లో ఎన్ని పద్యాలు చెప్తారో వారికి ప్రైజ్ డిస్ట్రుబ్యూషన్  మరియు  బహుమతి కూడా  పద్యం ను చూడకుండా చెప్పాలి 15 నుంచి 30 నిమిషాలు.

(ఆన్లైన్ లొనే లేక ముఖతః )..అందులో నారాయణ కవచం కానీ నృసింహ ఆవిర్భావం కానీ  చెబితే 3500 కాష్ అవార్డ్..

ఇట్లు 

శివ పరివారం 




శివ పరివారం పరిచయం 

గురువు అంటే సరైన నిర్వచనం 

ప్రతినెలా మొదటి ఆదివారం పాశుపత రుద్రాభిషేకం , ఆ ఆ రోజులు ను అట్టి ఆ మహాదేవుడుకి పుష్పాభిషేకము , అన్నాభిషేకం పంచ అమృతాభిషేకం 

శతచండి హోమములు ఇప్పటి అరకు 2 సార్లు చేసుకున్నాము (2014 మరియు 2018)

గురువుగారు తో కాశీ యాత్ర - దసరా నవరాత్రులు కాశీ గడిపిన మధుర క్షణాలు 

గురువు ఆరు తో తీర్ధ యాత్ర - నైమిశారణ్యం 

దశమహావిద్యలు - అమ్మవారి హోమాలు (తార , బగళాముఖీ చిన్నమస్తా )

పూర్ణ దీక్షత్వం శిషులుకు ఇవ్వడం 

గురువు గారు శిష్యులకు చండీ సప్తశతి భోదన 

నిత్యం గంగా ప్రవాహం లా జరిగిగే షోడశ మాస శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ప్రవచనం 

షోడశ మాస ఉపవాస దీక్ష మరియు ఉద్యాపన (256 సోమవారం వ్రతం)

శిష్యులకు ఆధ్యాత్మిక బోధనా , సమయాచారం సదాచారం ను తెలుపుట 

మహా శివరాత్రి , మాస శివరాత్రి నిర్వహించుట 

పౌర్ణమి , శ్రీ చక్రార్చన నావార్చన 

కార్తీక మాస జ్యోతిర్లించనలు 

గణపతి తర్పణాలు