Saturday, May 22, 2021

ఆయుర్వేదం లో వేదం కలిసి ఉంటుంది..ఈశ్వరుడు ని నమ్మాలి, వేదాన్ని నమ్మాలి

 ఆయుర్వేదం లో వేదం కలిసి ఉంటుంది..ఈశ్వరుడు ని నమ్మాలి, వేదాన్ని నమ్మాలి 

ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు.

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉంది.

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు, రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను

ఆయుర్వేదంలో జీవం అనేది మానవ శరీరం, ఇంద్రియాలు, మెదడు మరియు ఆత్మల సమ్మేళనంగా భావించ బడుతోంది. జీవించి ఉండే మనిషి మూడు దోషాలు (వాత, పిత్త మరియు ఖఫములు), ఏడు ప్రాథమిక ధాతు కణజాలాలు (రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రాలు) అలాగే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు (మలం, మూత్రం మరియు చెమట) లతో కలిసి ఉన్న ఒక సమ్మేళనం వంటిది. ఆ విధంగా మొత్తం శరీర నిర్మాణం శరీరంలో ఉండే ఈ దోషాలతోనూ, ధాతువులు, కణజాలంతోనూ మరియు వ్యర్ధ పదార్ధాల ఉత్పత్తులతోనూ కలిసి వుంటుంది. రసాలుగాను, ధాతువులుగానూ మరియు వ్యర్ధ పదార్ధంగానూ జీర్ణ ప్రక్రియ ద్వారా మారే మనం తీసుకునే ఆహారం చుట్టూ శరీరాకృతి మరియు అవయవ సంబంధిత పెరుగుదల మరియు క్షీణత అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆహారాన్ని మింగడం, అది జీర్ణమవడం, శరీరం దానిని గ్రహించడం, జీర్ణమయింది వంటబట్టడం అనేవి మానసిక వ్యవస్థపైన, అలాగే జీవాగ్ని (బయో ఫైర్) పైన, ప్రభావితం చేస్తూ, చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపే మన ఆరోగ్యంతోనూ, వ్యాధులతోనూ ఒకదానితో మరొకటి అంతర చర్యలను కలిగి ఉంటాయి.

ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి.

ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో  ఆయుర్వేదం గొప్పదనాన్ని తెలుసుకుని ,ఇంగ్లీష్ వైద్యం   విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను భారతదేశానికి వచ్చి తెలుసుకుంటారు . 

ఇది వరకు పూర్వం రోజుల్లో ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మెడికల్ షాప్స్ ఏమి లేవు.. 

ఆక్సిజెన్ అనే పదం వినబడేది కాదు..ఎక్కడో హాస్పిటల్ లో ICU రూమ్ లో ఎప్పుడో కానీ డాక్టర్స్ వాడే వారు .

మా చిన్నప్ప్పుడు నాన్నగారు ఉండే రోజుల్లో మా ఇంట్లో ఎప్పుడు ఆయుర్వేదం మందులే.. ఎదో పెద్ద జబ్బు చేస్తేనే తప్పదు అనుకుంటేనే డాక్టర్ గారు రెఫెర్ చేస్తేనే వారు హాస్పిటల్ కి వెళ్లే వారు.. అది కూడా ఇంటి డాక్టర్ ఎలా చేరారో అలాగే.

ఇప్పుడు హాస్పిటల్ COMMERICIAL , చెప్పడానికే సిగ్గు గా ఉంది.

ఇది వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో చావనప్రస్, అగ్నితున్ది, యోగరాజ్ గుగ్గిళ్ళు ,కాయం , ఆలా కొన్ని మందులు ఉండేవి . మాకు వెంకటేశ్వర ఆయుర్వేదం చింతలూరు వాళ్ళది నెలకి ఒకసారి వెళ్లి నాన్నగారు కొన్ని జనరల్ మందులు పట్టుకుని వచ్చే వారు..

మా నాన్నగారు అన్నగారు ఆయుర్వేద వైద్య నిపుణులు.. అయన పేరు డాక్టర్ రాణీ శ్రీనివాస శాస్త్రి గారు.. విజయవాడ సత్యనారాయణ పురం లో ఉఁడేవారు..భారతీయ రసాయన శాల అని పేరు ఉంటుంది.. ఆయన ఆయూర్వేదమే కాదు మంచి జ్యోతిష్య శాస్త్రవేత్త , మేము డిగ్రీ చదివే రోజుల్లో 

వారనికి ఒకసారి అయినా వెళ్లే వాళ్ళము..

మా ఇంట్లో చాల మందికి మా మావయ్యలు చిన్నతనం లో ఎన్నో పెద్ద పెద్ద రోగాలలను నయం చేసారు..

ఇది వరకు రోజులల్లో ఇంటి కి ఒక వైద్యులు ఉండేవారు..

ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రికే ఏమి తెలియడం లేదు.. కనీసం ఆ మంత్రి పదవి నిర్వహిస్తున్న వారికైనా డాక్టర్ డిగ్రీ ఉండాలి..ఇక ప్రభుత్వ ఆరోగ్య కార్యాలయం లు అలాగే ఉన్నాయ్ ఆస్పత్రులు అలాగే ఉన్నాయి.

నా అభిప్రాయం 

నా అభిప్రాయం లో ప్రభుత్వం మూడింటికే  ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ఒకటి వైద్యం , రెండు విద్య..మూడవది వ్యవసాయం  వాటికే ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి..

మిగతా ఫథకాలు, చెత్త చెదారాలు పక్కన పెట్టాలి..

ఇక ప్రభుత్వ హాస్పిటల్ ని కార్పొరేట్ కన్నా నీట్ గా ఉంచాలి.. మీరు చుడండి ప్రైవేట్ కి ప్రభుత్వ హాస్పిటల్ కి తేడా..అక్కడ ఇక్కడ నర్సు లు పంచి చేస్తారు.. స్టాఫ్ పని చేస్తారు, ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వ డాక్టర్స్ కి మంచి అనుభవమ్ ఉంటుంది.. కానీ తేడా ఎక్కడ శుభ్రత పరిశుభ్రత 

ప్రభుత్వ హాస్పిటల్స్ చాల బాగుంటాయి.. విశాలమైన ప్రదేశం  మొక్కలు చెట్లు, ఉంటాయి కానీ మీరు చుడండి అక్కడ పడిపోయిన జీప్స్ ,కార్లు , పనికి రాణి వస్తువులు ఉంటాయి.

కొన్ని సంవస్త్రాలు నుంచి..అదే ప్రైవైట్ హాస్పిటల్ లో చిన్న కాయితం డస్ట్ బిన్ లో వేయకపోయినా హౌసెకీపింగ్ వాళ్ళకి క్లాస్ పీకుతారు అడ్మిన్ డిపార్ట్మెంట్..

ఇక అస్సలు విషయానికి వస్తే ప్రభుత్వ హాస్పిటల్ ని ఒక కార్పొరేట్ కన్నా నీట్ గా ఉంచండి 

పడిపోయిన డ్రైనేజీ గొట్టాలు , మొదలైనవి ఎప్పటికప్పుడు నీట్ గా రిపేర్ చేయించండి.

నోటీసు బోర్డు పెట్టండి..డస్ట్ బిన్స్ ఏర్పాటు చెయ్యండి..చాల పరిశుభ్రత గా ఉంచండి..

వచ్చిన రోగులని మనసారా పలకరించండి.. దూరం నుంచి వచ్చిన వారికీ వేరేగా వసతి ఏర్పాటు చెయ్యండి..కాంటీన్ లో ఖరీదు కాకుండా మంచి భోజనం టిఫిన్ ఏర్పరతు చెయ్యండి..

డాక్టర్స్ , నర్స్ లు కాంపౌండ్ మొ..సిబ్బంది పలకరించి తక్షణం వారి కి కావలసిన ఏర్పాటు చెయ్యండి. ఓటు వేసిన ప్రజలు అందరు ప్రభుత్వ హాస్పిటల్ లోనే చూపించుకోండి.. జిల్లా వారీగా ఉన్నాయి కదా..ధనవంతుడు ,పేదవాడు అని చూడకుండా వారి ప్రాణాన్ని కాపాడండి..

మంత్రులు , అధికారులు ఆకస్మిక తనికీలు నిర్వహించండి..

నామమాత్రపు వసూళ్లు చెయ్యండి.. అందరికీ అదే రేటు.. మీ హాస్పిటల్ అభివృద్ధి కి ఒక డొనేషన్ ప్రొగ్రమ్మె పెట్టుకోండి.. అక్కడ ధర్మ హుండీ పెట్టుకోండి.. పెద్ద పెద్ద వాళ్ళదగ్గర అభివృద్ధి కి కేటాయించుకోండి..

మిమ్మలిని నమ్మి కదా జనాలు ఓట్లు వేసి గలిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకానికి వొమ్ము కాకుండా చూసుకోండి..ఆపదలో ఆదుకోండి..ఒక్కసారి ఇలా చేసి చుడండి 

ప్రభుత్వ అధికారులు , మంత్రులు కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకుంటారు.. సామాన్య ప్రజలు మాత్రం అగచాట్లు పడి ప్రభుత్వ హాస్పిటల్ లో చూపించుకుంటారు..

ఈ ప్రభుత్వ డాక్టర్స్ మాత్రం సాయంత్రం టైం కి వచ్చి ఇంటి దగ్గర మంచి ట్రీట్ మెంట్ ఇస్తారు.. 

ఒక్క డాక్టర్ కి మాత్రమే ఈశ్వరుడు రోగం నయం చేసే అధికారం ఇస్తాడు..

ఇలాంటివి అన్ని మా మనసులో భాధలు , ఊహాగానాలు మాత్రమే

.. ఇలాంటి రోజులు ఈ జన్మకి చూస్తానో లేదో..

ప్రభుత్వానికి ఒక రోగి మరణం ఒక లెక్క మాత్రమే..కానీ అది ఒక కుటుంబ వ్యస్వస్త చిన్నాభిన్నం చేస్తది

ఈ మధ్య ఎంతో మాది మేధావులు, చిన్న పిల్లలు, మంచి ఉద్యోగస్తులు , భాద్యత గల కుటుంబ యజమానులు , మధ్య తరగతి వాళ్ళు అందరు వెళ్లిపోతున్నారు..

ప్రాణం ఎవరిదైనా ఒకటే అనే భావన లో ఉండాలి..

ఇంతకంటే ఎక్కువ గా చెప్పలేను